Parliament Elections : రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగా ణ బిజెపి నేతలు దృష్టి సారిం చారు. తెలంగాణలో సభ నిర్వహించే యోచన లో తెలంగాణ బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు. ఈ సభకు ప్రధాని మోడీని ఆహ్వానించాలని బిజెపి నేతలు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి పలువురు ఇన్చార్జ్ లు తెలంగాణకు చేరుకు న్నారు.
తెలంగాణలో కొన్ని అసెంబ్లీ స్థానాలను దక్కిం చుకున్న బిజెపి ఇప్పుడు ఎంపీ స్థానాలను దక్కించుకోవాలని పావులు కదుపుతుంది. మోడీ సభ నిర్వహిస్తే సీట్లు పెరిగే అవకాశం ఉందని బిజెపి నేతలు భావిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ నుంచి మోడీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని గతంలో తెలంగాణ బిజెపి నేతలు తీర్మానం చేశారు. ఈ విషయాన్ని కూడా మోడీకి తెలియజేసి తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిం దిగా మోడీకి విజ్ఞప్తి చేయనున్నారు.