BRS B-Forms Pending : తెలంగాణలో 115 నియోజకవర్గాల్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థలను ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు.. వారికి బీఫామ్స్ అందించే ప్రక్రియను మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 105 మందికి బీఫామ్స్ ఇచ్చేశారు కూడా. అయితే మరో 10 మందికి మాత్రం పెండింగ్ లో ఉంచారు.అయితే వారికి ఇస్తారా.. లేదా.. కావాలనే పెండింగ్ లో పెట్టారా.. అధినేత మనసులో ఏముంది అనేదానిపైనే ఇప్పుడు చర్చ జోరుగా సాగుతున్నది.
కాగా, ఈనెల 15న 69 మంది పార్టీ బీ ఫామ్స్ ఇచ్చారు. ఇక 16న మరో 28 మందికి ఇచ్చారు. అయితే కీలకంగా నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి స్థానాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వీరిలో కొంత మందికి మార్పు తప్పదన్న వాదన వినిపిస్తున్నది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థిత్వంపై పార్టీ అధినేత కేసీఆర్ తన మనసు మార్చుకున్నారని టాక్ వినిపిస్తున్నది. ఇక్కడ అతడిని మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే అబ్రహంకు ఇప్పటివరకు కేటీఆర్, కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని సమాచారం వినిపిస్తున్నది.
ఇక బీఫాంలు కూడా అధినేత కేసీఆర్ విడుతల వారీగా ఇస్తున్నారు. సీనియర్ నేతగా ఉన్న కడియం శ్రీహరి కి కూడా స్టేషన్ ఘన్ పూర్ నుంచి బీ ఫామ్ గురువారం ఇచ్చారు. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను బట్టి బీ ఫామ్స్ ఇవ్వాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం. అయితే అభ్యర్థులను ప్రకటించినా బీ ఫామ్ ఇవ్వకపోవడంతో వారిలో టెన్షన్ నెలకొంది. ఆఖరి నిమిషంలో బీ ఫామ్ అందకపోతే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం వారిలో నెలకొంది.