Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఫ్రస్టేషన్ లో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తెలుగువారికి సేవలందిస్తున్న మార్గదర్శిపై కావాలనే దురుద్దేశంతో కేసులు పెడుతూ సంస్థను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డైరెక్టుగా ఎదుర్కోలేక అడ్డదారుల్లో టీడీపీకి కావాల్సిన సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రకు తెరతీస్తున్నారని విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలిచే పత్రికలపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఈనాడుపై కావాలనే కుట్రలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలనను ఖూనీ చేస్తూ అపహాస్యం చేస్తున్నారని ఘాటుగా స్పందించారు. ఎల్లో మీడియా అంటూ సెటైర్లు వేస్తూ తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు. వారి ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. వీధి రౌడీల్లో వ్యవహరిస్తూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. చీటికి మాటికి ప్రతిపక్షాలను నిందిస్తూ కాలం గడుపుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు. జగన్ లో ఫ్రస్టేషన్ పెరుగుతోంది. అందుకే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.
జగన్ చేసిన దుష్ట ప్రయత్నాలు విఫలం కావడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఆగడాలు అడ్డుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రాష్ట్రంలో ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. సామాన్యులకు స్థానం కూడా ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో జగన్ నియంత పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం వచ్చింది. అందుకే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టాలని వేడుకుంటున్నారు. జగన్ పాలనను తుద ముట్టించాలని చెబుతున్నారు.