CM Jagan Meeting :
సీఎం జగన్ గత నాలుగేళ్లలో నేరుగా కార్యకర్తలను కలిసిందే లేదు. ఇప్పుడు నేరుగా వారిని కలవాలని అనుకుంటున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయి నేతలో ముహూర్తం ఖరారు చేశారు. అక్టోబర్ 9న విజయవాడలో సీఎం అన్ని మండలాల నాయకులతో సమావేశమయ్యేందుకు ముహూర్తం ఖరారు చేశారు. పార్టీ కోసం క్రియాశీలక నేతలతో పాటు అనుబంధ సంఘాల నాయకులకు ఆహ్వానం పంపనున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడడంతో పాటు ఎన్నికలకు దిశానిర్దేశం చేయనున్నారు.
విజయవాడలో జరిగే సమావేశానికి ఎమ్మెల్యేలను పిలవడం లేదని సమాచారం. కాగా ఈ సమావేశంలో ఏపీకి జగన్ అవసరం ఏంటి అనేది ప్రధానంగా చర్చకు తేవాలని చూస్తున్నారు. ఇప్పుడు నేరుగా ద్వితీయ శ్రేణి నాయకత్వంతో సమావేశం కానుండడం ద్వారా పార్టీ నేతలు తమ నియోజకవర్గాల్లోని పరిస్థితులను తెలుసుకోనున్నారు. ఇక్కడే సీఎం జగన్ భవిష్యత్ కార్యచరణను సిద్ధం చేయనున్నారు. ప్రతిపక్షాల పొత్తుల నేపథ్యంలో కార్యకర్తలకు పార్టీలో భవిష్యత్ పైన హామీ ఇవ్వడంతో పాటు ఎన్నికలకు సిద్ధమవ్వడంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 అనే నినాదంతో ఆయన ముందుకెళ్తున్న నేపథ్యంలో కార్యకర్తల అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకోనున్నట్లు సమాచారం.