మరోవైపు ఆయన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిన నేపథ్యంలో కేంద్రం వ్యయాన్ని రూ. 10500 కోట్లకు పెంచుతూ గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే ఆర్థిక శాఖ దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటే, వెంటనే కేంద్ర మంత్రి వర్గం ఆమోదించే అవకాశం ఉంటుంది. ఇక కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ నివాసానికి కూడా వెళ్లి ఏపీ సీఎం జగన్ కలిశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బకాయిల రూపంలో ఏపీకి రూ. 7359 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి స్పందిస్తూ ఆర్డీఎస్ఎస్ పథకానికి ఏపీ అర్హత సాధించిందని, దాని కింద అందించే ఆర్థిక సహాయం గురించి చర్చించామని చెప్పారు.
ఇక ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రితో కూడా జగన్ శుక్రవారం భేటీ కానున్నారు. ఇక రాత్రి అమిత్ షా తో భేటీ కాబోతున్నట్లు సమాచారం. ఇక ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పలు రాజకీయ పరమైన నిర్ణయాలపై వీరిద్ధరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. దీంతో పాటు చంద్రబాబు అరెస్ట్, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేయడంలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. ఏదేమైనా చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరుగుతున్న ఈ భేటీ ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమైంది. బీజేపీ, వైసీపీ కలిసే ఈ కుట్రలో పాలుపంచుకున్నాయని వాదనల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ అడుగులు తర్వాత ఎలా ఉంటాయనే దానిపై ఏపీలో రాజకీయాలు మారబోతున్నాయి.
ReplyForward
|