Complaints against Minister Roja : టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన రోజా రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. టీడీపీ లో క్రియాశీలకంగా పని చేశారు. తెలుగు దేశం నుంచి రెండు సార్లు పోటీ చేసినా విజయం సాధించలేదు. ఆ తర్వాత వైసీపీ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రోజా గెలిస్తే ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుందని, ఐరెన్ లెగ్ అని కొద్ది రోజులు ముద్ర వేశారు. మొదటి సారి ప్రతిపక్షంలో ఉన్న రోజా.. ఆ తర్వాత ఆమె కొనసాగుతున్న వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది.
ఐరెన్ లెగ్ అనే ముద్ర చెరిపేసుకున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో క్రియా శీలకంగా వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఈటీవీ జబర్ధస్త్ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించారు. ఇక ఏపీ మంత్రిగా పదవిస్వీకారం చేసాకా జబర్దస్త్ ను వీడారు. జబర్దస్త్ ఆమె కెరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్ గా నిలచింది. మరో చానల్ లో నూ కుటుంబ తగాదాలు పరిష్కరించే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు. వెండితెర మీద లాగానే బుల్లి తెరమీద కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. జబర్దస్త్ ప్రోగ్రామ్ పై కొన్ని విమర్శలు ఉన్నా ఆమెకు మంచి మైలేజీ వచ్చింది.
జగన్ క్యాంపులోని మహిళా లీడర్లలో రోజాకు ప్రత్యేక స్థానం ఉంది. జగన్ పై ప్రతిపక్ష నాయకులు ఏ మాత్రం విమర్శించినా ఊరుకోదు. వెంటనే కౌంటర్ ఇస్తుంటారు. ఈ విషయంలో రోజా ముందుంటున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాన్ లపై విమర్శలు చేస్తుంటారు. తాజాగా రోజా చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో మంత్రి రోజాపై నందిగామ పోలీస్ స్టేషన్లో పలువురు ఫిర్యాదు చేశారు.
ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు బుడబుక్కల కులస్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. తమను అవమానించారంటూ ఆ కుల సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. రీసెంట్గా మంత్రి రోజా ఎవరినో ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు బుడబుక్కల కులాన్ని కించపరిచేలా ఉన్నాయనేది వారి వాదన. మంత్రి రోజా ఈ వ్యాఖ్యలు చేయడం పై నందిగామ పోలీస్ స్టేషన్ లో బుడబుక్కల సంఘం నాయకులు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.