Cricket Fever Start in Ahmadabad : ఇండియాలో క్రికెట్ ఆటకు అభిమానులు ఎక్కవే. ఇక భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆ ఫీవర్ మరింత ఎక్కువగా ఉంటుంది. స్వదేశంలో ఈ మ్యాచ్ జరుగుతుండడంతో ఇక మరింత ఊపు ఉంటుంది. ప్రస్తుతం గుజరాత్ రాష్ర్టంలోని అహ్మదాబాద్ లో ఈ మ్యాచ్ జరగనుంది.
అయితే ఈ మ్యాచ్ కోసం స్టేడియానికి లక్ష మంది అభిమానులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎలా తహతహలాడుతున్నారో అనేందుకు ఇదే ఉదాహరణ. ఈ మ్యాచ్ వీక్షించేందుకు బయట ప్రాంతాల నుంచి వచ్చే అహ్మదాబాద్ దవాఖానల్లో మకాం పెడుతున్నారు. అహ్మదాబాద్ లోని హోటల్స్ గదులన్నీ మొత్తం బుక్కయ్యాయి. ఉన్నవి కూడా 20 శాతం రెట్లు పెరిగాయి. దీంతో ఎక్కుడుండాలో తెలియక, ఎలాగైనా మ్యాచ్ చూడాలన్న పట్టుదలతో ఉన్న అభిమానులు దవాఖానల్లో బెడ్ లు బుక్ చేసుకుంటున్నారట. దవాఖానల్లో ఆరోగ్య పరీక్షలతో పాటు ప్యాకేజీలతో టెస్టులు చేయించుకునేందుకు ఈ బెడ్ లను బుక్ చేసుకున్నారు.
ఇక వైద్య పరీక్షల అనంతరం మ్యాచ్ సమయానికి వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. దీని వల్ల అటు వైద్య పరీక్షలు పూర్తవడంతో పాటు మ్యాచ్ కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. అయితే రోగులకు తప్ప, అభిమానులకు ఇవ్వడానికి కొన్ని దవాఖానలు విముఖత చూపుతున్నాయి. అయితే అభిమానులు మాత్రం టెస్టులు చేయించుకుంటామంటూ సిబ్బందిని బతిమాలాడుతున్నారు.శనివారం ఈ మ్యాచ్ జరగనుండగా,ఇప్పటికే దవాఖానలు, హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. వివిధ రాష్ర్టాలతో అభిమానులు ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నారు.