India vs Pakistan :
ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య వన్డే మ్యాచ్ శ్రీలంక వేదికగా నేడు జరగబోతోంది. అయితే వరుణుడు పొంచి ఉన్నాడని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షం కాసేపు పడి ఆగిపోతే ఓవర్లు కుదించే అవకాశం ఉంటుంి. డక్ వర్త్ లూయీస్ పద్దతి ప్రకారం ఓవర్లు 20కి కుదించి పరుగులు కూడా తగ్గిస్తారు. దీంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా అనేది సందేహమే.
ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్ జరిగి రెండో ఇన్నింగ్స్ లో 20 ఓవర్ల తరువాత వర్షం పడితే కూడా డక్ వర్త్ లూయీస్ ప్రకారం విజేతను ప్రకటించాల్సి ఉంటుంది. దీంతో మ్యాచ్ సాగితే ప్రేక్షకుల సంతోషానికి అవధులు ఉండవు. దాయాదుల పోరులో ఎవరిది పైచేయి అవుతుందో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంటుంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.
ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే చెరో పాయింట్ వస్తుంది. కాండీ వేదికగా శనివారం మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ తుఫాన్ ప్రభావంతో ఆ ప్రాంతంలో వర్షం పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. టికెట్లు ఆన్ లైన్ లో కొన్ని నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. దీంతో మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు కమ్ముకున్నాయి. దీంతో మ్యాచ్ రద్దయితే ఎలా అనే భయం అందరిలో పట్టుకుంది.
కోట్లాది మంది ప్రేక్షకులు మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. వారి ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడేమోనని భయపడుతున్నారు. 2019 వరల్డ్ కప్ తరువాత రెండు జట్లు ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. శుక్ర, శనివారాలు కాండలో వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మ్యాచ్ కు వరుణుడు విలన్ గా మారనున్నాడని తెలుస్తోంది.