Rajamouli :
‘స్టూడెంట్ నెంబర్ వన్’ చిత్రంతో టాలీవుడ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు రాజమౌళి. ఈ మూవీ తర్వాత సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా చరిత్రలో తిరుగు లేని దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు.
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తీసిన ఆయన తెలుగు సినిమా గొప్పతనం ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ గా కలెక్షన్ ల వర్షం కురిపించింది. ఆస్కార్ అవార్డు ను కూడా కైవసం చేసుకుంది. తను తీసిన సినిమాలతో ఎందరో నిర్మాతలు ఎంతో లాభం ఆర్జించిపెట్టారు జక్కన్న ఇలాంటి సక్సెస్ ఫుల్ దర్శకుడి సినిమాలలో ఒక సినిమా వల్ల సంబంధిత నిర్మాతకు తీవ్రంగా నష్టం కలిగింది అని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.
రాజమౌళి బుల్లితెరపై కేరీర్ ప్రారంభించాడు. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ చిత్రంతో సినీ దర్శకుడిగా టాలీవుడ్ లోకి అరంగేట్రం చేశాడు. ఆ తదుపరి చిత్రం ‘సింహాద్రి’తో ఇండస్ట్రీలో సూపర్ హిట్ సాధించాడు. తర్వాత ‘మగధీర’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ పొందాడు. ఈ మగధీర సినిమాతో భారతీయ సినీ ప్రేక్షకులు తెలుగు ఇండస్ట్రీ వైపు దృష్టి పెట్టడం మొదలు పెట్టారు. ఇక బాహుబలితో భారతీయ సినీ ఇండస్ట్రీ రికార్డులన్నిటినీ తిరగరాయడమే కాక, అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా ఆకట్టుకుంది. ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటి చెప్పాడు. టాలీవుడ్ కు ఆస్కార్ పట్టుకచ్చాడు.
ప్రస్తుతం రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ హాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఎదురుచూస్తుండడం విశేషం. ఇది ఇలా ఉంటే ప్లాప్ ఎరుగని రాజమౌళి సినిమాలు నిర్మాతలకు పెట్టినదానికన్న రెండు మూడు రెట్లు ఎక్కువ లాభాలను కురిపిస్తాయి. కానీ ఆయన తీసిన సినిమాలలో ఒకటి మాత్రం కమర్షియల్ గా విజయం సాధించిన కూడా కలెక్షన్స్ పరంగా బిగ్గెస్ట్ హిట్ అందుకోలేదని అంటున్నారు. అదే నితిన్ నటించిన ‘సై’ మూవీ. ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుంది.
దాదాపు ఎనిమిది కోట్ల బడ్జెట్ తో ‘సై’ మూవీని నిర్మించారట. అయితే ఈ మూవీ లాంగ్ రన్ లో పన్నెండు కోట్లను మాత్రమే కలెక్ట్ చేసిందట. కమర్షియల్ గా ఈ మూవీ విజయం సాధించినా, కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్ లకు అనుకున్న రేంజ్ లో లాభాలు రాలేదని, కొద్దిపాటి నష్టాలు వచ్చాయని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.