Politics : ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయిన తర్వాత రెండిటి మధ్య పోలికలను చూడడం ప్రజలకు కామన్ గా మారిపోయింది. పరిపాలన, పథకాలు, రాజకీయాల దగ్గర్నుంచి ప్రతి అంశాన్నీ పోల్చి చూస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల అమలుపైనా చర్చ జరుగుతున్నది. ఏ ప్రభుత్వం ఎక్కువగా లబ్ది చేకూర్చుతున్నదని ప్రజలు చర్చించుకుంటున్నారు. అక్కడేం పథకాలు ఉన్నాయి. ఏ పథకం ద్వారా ఏ ప్రయోజనం చేకూరుతున్నదని ఆరా తీస్తున్నారు.
తెలంగాణ లో సంక్షేమ జోరు
సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్లలో ఎన్నో పథకాలను అమలు చేశారు. ఒక్కో పథకానికి పెద్ద మొత్తలో నిధులు సమకూరుస్తున్నారు. దళిత బంధు కింద ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షలు ఇస్తున్నారు. బీసీ బంధు, మైనార్టీ బంధు కింద రూ. లక్ష చొప్పున చెక్కులు అందజేస్తున్నారు. ఇప్పడు కొత్తగా గృహలక్ష్మి పథకం కింద ఇళ్ల నిర్మాణానికి రూ. మూడు లక్షల చొప్పున ఇచ్చేందుకు దరఖాస్తులు కూడా తీసుకున్నారు. మొన్నటికి మొన్న రైతులకు రుణమాఫీ కూడా చేసేశారు. ప్రతీ రోజూ వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని నివారించుకుంటున్నారు.
బటన్ నొక్కినా డబ్బులేవి..?
మరో వైపు ఏపీ సర్కార్ ప్రకటించిన పథకాలకు సంబంధించిన బటన్లను సీఎం జగన్ సకాలంలో నొక్కడం లేదని అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. సకాలనొక్కలేకపోతున్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ అందక విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు. బటన్లు నొక్కినా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు మాత్రం పడడం లేదు. అన్ని పథకాలదీ అదే తీరు. ప్రయోజనం తక్కువైనా ఫలితం అందడం లేదు.
ఇటీవల జీరో వడ్డీ పేరిట కోటి మంది డ్వాక్రా మహిళలకు 1200 కోట్లు ఇస్తానంటూ జగన్ రెడ్డి బటన్ నొక్కారు. అంటే ఒక్కో మహిళకు వచ్చేది కేవలం రూ.1200 మాత్రమే. అవీ పడలేదు. అసలు బటన్లు నొక్కడం ఎందుకు, మోసం చేయడం ఎందుకు అక్కడి లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పథకాలు ప్రకటించే సాహసం కూడా చేయలేకపోతున్నారు. ప్రభుత్వం దగ్గర విషయం అయిపోయిదని ప్రజలు కూడా ఓ అంచనాకు వస్తున్నారు.
ఇంకా నమ్ముతారా?
ఇక జగన్ తన వ్యతిరేకతను పొగొట్టుకునేందుకు కొత్త పథకాలు ప్రకటిస్తే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. జగన్ ప్రజాధనాన్ని సొంతానికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసుకుంటున్నారు. పథకాలకోసం కేంద్రం నుంచి అప్పులు తేవడం… ఆస్తులు అమ్ముకోవడం చేస్తున్నారు. ఎన్ని చేసినా ఉన్న పథకాలకే డబ్బులు సరిపోవడం లేదు. అందుకే కొత్త పథకాలు ప్రకటించినా జగన్ ను మరింత అప్రతిష్టపాలు కాక తప్పదు.