Dravid and Rohit Trouble : ఆవారం జరిగిన రెండో వన్డేలో భారత్ చేతిలో ఆస్ట్రేలియా కుదేలయిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో భారత్ అద్భుతమైన ప్రదర్శన కొనసాగించింది. 400 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా చతికిల పడింది. మధ్యలో వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టార్గెట్ కుదించారు. 33 ఓవర్లలో 317 పరుగులుగా నిర్ణయించారు. దీంతో పరుగుల వేటలో ఆస్ట్రేలియా వెనుకబడిపోయింది.
తుది జట్టు కోసం రోహిత్, ద్రవిడ్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో తొలి రెండు మ్యాచుల్లో ప్లేయింగ్ ఎలవన్ లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. దీంతో జట్టు కష్టాల్లో పడుతున్నా ఎవరో ఒకరు చెలరేగి ఆడి జట్టును గెలిపిస్తున్నారు.
ఆసియా కప్ లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి ను తప్పించడంతో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ల్లో ఐదు వికెట్టు పడగొట్టాడు. సిరాజ్ ఆరు వికెట్లు తీశాడు. టీమ్ మేనేజ్ మెంట్ అనుభవజ్ణులకు పెద్దపీట వేయడం లేదు. ఫలితంగా కొంత ఇబ్బందులు పడుతోంది. గాయం కారణంగా రెండో వన్డేకు ఆడిన శ్రేయస్ అయ్యర్ 105 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా అర్థశతకం చేశాడు.
రోహిత్, కోహ్లి, కుల్దీప్ లాంటి సీనియర్ ఆటగాళ్లున్నా కష్టాలు తప్పడం లేదు. దీంతో ఆటగాళ్ల తీరు విమర్శలకు తావిస్తోంది. దీంతో ఎవరిని పక్కన పెట్టాలి? ఎవరిని ఆడించాలో తెలియడం లేదు. రోహిత్, ద్రవిడ్ ఆటగాళ్ల విషయంలో ఎంత శ్రద్ధ పెట్టినా సరైన ఫలితాలు మాత్రం రావడం లేదు. ప్రపంచ కప్ లో విజయాలు సాధించాలంటే ఆటగాళ్లలో మార్పులు రావాల్సిందే.