Telangana Assembly Polls :
తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. ఎన్నికలు డిసెంబర్లో ఉంటాయనే అంచనాలను తలకిందులు చేస్తూ నవంబర్ లోనే పూర్తి చేసేలా షెడ్యూల్ ఈసీ ప్రకటించింది. అయితే నవంబర్ 30 న ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రకటన చేసింది. ఇక తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్య ప్రదేశ్, మిజోరం, ఛత్తీస్ గఢ్ రాష్ర్టాల్లో ఎన్నికలు నిర్వహించనుంది. ఈ మేరకు సీఈసీ రాజీవ్ కుమార్ ఢిల్లీలో ప్రెస్ మీట్ ద్వారా వివరాలు వెల్లడించారు.
కాగా ఈ ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. మొత్తంగా 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 40 రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలించామని తెలిపారు. పార్టీలు, ప్రభుత్వాధికారులతో చర్చలు జరిపామని అనంతరమే ప్రకటన చేస్తున్నట్లు చెప్పారు.
ఇక మిజోరం, మధ్య ప్రదేశ్ రాష్ర్టాల్లో నవంబర్ 7న, ఛత్తీస్ గఢ్ లో నవంబర్ 7,17న రెండు విడుతల్లో, రాజస్థాన్ లో నవంబర్ 23న ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ర్టాల్లో ఇప్పటికే సర్వం సిద్ధం చేసినట్లు ప్రకటించారు.
ఇక తెలంగాణలో ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఇదే..
నవంబర్ 3న: నోటిఫికేషన్
నవంబర్ 10 : నామినేషన్లు దాఖలు చేసేందుకు తుదిగడువు
నవంబర్ 13 : నామినేషన్ల పరిశీలన
నవంబర్ 15 : నామినేషన్ల ఉపసంహరణ
నవంబర్ 30 : ఎన్నికలు
డిసెంబర్ 3 : కౌంటింగ్ ప్రక్రియ
డిసెంబర్ 5 : ఎన్నికల ప్రక్రియ పూర్తి