Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్ కామెంట్స్ చేసింది. ఎప్పుడూ పాటలతో బిజీబిజీగా ఉండే ఆమె ఇన్ స్టాగ్రాం స్టోరీ లో ఒక పోస్టు షేర్ చేసింది. దీంతో గీతా మాధురి కూడా ఇలాంటి పోస్టులు షేర్ చేస్తుందా అని తెగ అనుకుంటున్నారు. గీతా మాధురి ఇన్ స్టా గ్రాంలో మన జీవితం చాలా గొప్పది ఎప్పుడూ కూడా దాన్ని చాలా తీవ్రంగా తీసుకోవద్దని అన్నారు.
మనం ఈ జీవితంలో ఎప్పటి వరకు ఉంటామో తెలియదు. ఎన్ని రోజులు జీవిస్తామో తెలియదు. కాబట్టి ఈ జిందగీలో బతికనన్నీ రోజులు సంతోషంగా, హాయిగా గడిపేందుకు ప్రయత్నించాలి. జీవితాన్ని వృథా ప్రయాసల కోసం వెస్ట్ చేసుకోవద్దు అంటూ పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రతి దాన్ని తేలికగా తీసుకోకూడదని అర్థం వచ్చేలా చెప్పింది.
గీతా మాధురి తన తోటి నటుడు నందును పెళ్లి చేసుకుంది. సింగర్ గా ఎన్నో అద్భుతమైన పాటలు పాడి అందరికీ సుపరిచితురాలైంది. నందు ప్రస్తుతం ఓ ఫేమస్ చానల్ లో స్పోర్ట్ యాంకర్ గా చేస్తున్నాడు. అంతకుముందు కూడా అతడు ఎన్నో సినిమాల్లో నటించాడు. చాలా వరకు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించాడు. కొన్ని సినిమాల్లో కీలక రోల్స్ పోషించాడు. గీతా మాధురి కూడా సింగర్ గా, జడ్జిగా వివిధ రకాలుగా సంపాదిస్తూనే ఉంది.
గీతా మాధురికి క్యాసినో ఆడటం అలవాటు ఉండేదని దాని ద్వారా కొన్ని లక్షల రూపాయల్లో డబ్బులు పొగోట్టుకున్నానని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. దీంతో ఇంత బోల్డ్ గా ఎవరూ చెప్పరు.. నువ్వు గ్రేట్ అని చాలా మంది అన్నారు. కొంతమంది మాత్రం నీకు అదేం అలవాటు చక్కగా ఉన్నట్లు కనిపిస్తావు.. క్యాసినోలకు వెళ్లి జూదం లాంటివి ఆడటం సరైనది కాదని విమర్శించారు. ఏదైమైనా ఏ విషయమో కానీ గీతా మాధురికి తెలివొచ్చినట్లుంది. జీవితం గురించి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా పోస్టు పెట్టింది.