Godzilla x Kong : గాడ్జిల్లా మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ది న్యూ ఎంపైర్ అనే సరికొత్త థీమ్ తో థియేటర్లలో విడుదల కాగా.. మార్చి 29న ఇండియా లో రీలీజైంది. ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే బాలీవుడ్ లో క్రూ చిత్రంలో పోటీ పడి మరీ కలెక్షన్లు రాబడుతోంది. క్రూ లో కరీనా కపూర్, కృతి సనన్, టబు లాంటి టాప్ హిరోయిన్లు నటించిన విషయం తెలిసిందే.
2024 లో ఇండియాలో విడుదలైన ఈ గాడ్జిల్లా మూవీ దాదాపు 37.60 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో ఒక హలీవుడ్ మూవీ సాధించిన కలెక్షన్లను రికార్డు బ్రేక్ చేసింది. భూమిని స్వాధీనం చేసుకోవాలని చూసే స్కార్ కింగ్ తో గాడ్జిల్లా, కింగ్ కాంగ్ కలిసి పోరాటం చేస్తాయి. అయితే గాడ్జిల్లా, కింగ్ కాంగ్ గతంలో లాగా ఒకరితో ఒకరు పోరాటం చేసుకోకుండా కలిసి స్కార్ కింగ్ ను ఓడించేందుకు ప్రయత్నం చేస్తాయి. అత్యంత క్రూరమైన స్కార్ షిమో మంచు టైటాన్ ను స్వాధీనం చేసుకుని ఆ తర్వాత భూమిని ఆక్రమించుకోవచ్చని ప్లాన్ చేస్తుంది.
గాడ్జిల్లా ఈ ముప్పును గ్రహించి కొత్త శక్తి కోసం ట్రై చేస్తుంది. కాంగ్ హోలో భూమిని అన్వేషిస్తూ రహస్య సామ్రాజ్యానికి దారి చూపే యువ కోతిని మీట్ అవుతుంది. ఈ మూవీలో కొంతమంది ప్రీవియస్ సిరీస్ లో నటించిన రోల్స్ నే కంటిన్యూ చేశారు. బ్రియాన్ టైరీ హెన్రీ, డాన్ స్టీవెన్స్, కేలీ హట్లే, అలెక్స్, ఫెర్న్స్, పాలా చెన్, రెబక్కా హాల్ అనే నటీనటులు తన పర్ఫామెన్స్ చూపించారు.
ఈ మూవీ ఓటీటీ ప్లాట్ పాంలో ఎప్పుడు వస్తుందా అని హలీవుడ్ సినిమాలు చేసే ప్రేక్షకులు ఎదురు చూస్తుండగా.. మే 14 న రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి అడమ్ వింగార్డ్ డైరెక్షన్ చేయగా.. మాన్ స్టర్ ఫిల్మ్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా దాదాపు ఇండియా కరెన్సీలో రూ. 4372 కోట్ల ను వసూలు చేసి చరిత్ర సృష్టించింది. దీని నిర్మాణానికి దాదాపు 135 మిలియన్ డాలర్లు ఖర్చు పెడితే.. రూ. 524 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు రాబట్టింది.