Guntur Kaaram : దర్శకుడు తివ్రికమ్ రాజకీయాలకు దూరంగా ఉంటారు. తన మిత్రుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉన్న ఆయన మాత్రం వాటికి దూరంగానే ఉంటాడు. కాంట్రావర్సీలకు ఆమడ దూరంలో ఉంటారు. అయితే పవన్ కల్యాణ్ కోసం ‘బ్రో’లో కొన్ని పొలిటికల్ పంచ్ లను రాయాల్సి వచ్చింది. అయితే అవి బాగానే పేలాయి. త్రివిక్రమ్ కు మాటల మాంత్రికుడు అనే పేరు ఉందని అందరికీ తెలిసిందే. ఆయన కలం డైలాగ్ లను ఏ రకంగానైనా జనాలను మెప్పించేలా రాయగలుగుతుంది. అందుకే ఆయన సినిమాల్లో డైలాగులు ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన సినిమాలో ప్రతీ మాట ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంది..అయితే తాజాగా ఆయన ‘గుంటూరు కారం’’లో పొలిటికల్ పంచ్ ల ఘాటు బాగానే ఉండబోతుందని సమాచారం.
అతడు, ఖలేజా మూవీల తర్వాత మహేశ్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి బరిలో ఉండడం బోనస్. కలెక్షన్ల జోరు సాగుతుందనే చెప్పాలి. ఇక ఈ సినిమా కథేమిటి? హీరో ఏం చేస్తుంటాడు? అనేది ఇప్పటి వరకూ బయటకు రానివ్వలేదు మూవీ మేకర్స్. అయితే ఈ సినిమాలో పొలిటికల్ అంశాలకు ఢోకా లేనట్టు తెలుస్తోంది. గుంటూరు మేయర్ రాజకీయాల చుట్టూ ఈ కథ నడుస్తుందట. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెను మేయర్ చేసే బాధ్యతను మహేశ్ తీసుకుంటారట. ఆ ప్రయాణంలో ఎదురయ్యే అవాంతరాలు, ఆటంకాల నేపథ్యంలో సినిమా సాగుతుందని టాక్.
అయితే ఈ మూవీకి తొలుత ‘అమరావతికి అటూ ఇటూ’ అనే టైటిల్ అనుకున్నారట. మరీ క్లాస్ అయిపోయిందని, ‘గుంటూరు కారం’ లాంటి మాస్ మసాలా టైటిల్ ఫిక్స్ చేశారు. మూవీలో రమ్యకృష్ణ- మహేశ్ మధ్య సన్నివేశాలు ఫుల్ ఎమోషనల్ గా ఉంటాయని తెలుస్తోంది. పాటలు, మహేశ్ గెటప్, టైటిల్ ..ఇవన్నీ ఊరమాస్ గా ఉన్నాయి. అయితే సినిమాలోని సన్నివేశాలకు కుటుంబ ప్రేక్షకులు ఫిదా అవుతారని సమాచారం.