Trivikram : టాలీవుడ్ లో మంచి పేరున్న దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. కానీ ఇటీవల ఆయన పెన్ పవర్ తగ్గిందనే వాదనలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా సముద్రఖని దర్శకత్వం వహించిన సినిమా బ్రోకు మాటలు త్రివిక్రమ్ రాశాడు. కానీ పంచులేవీ లేవని సమాచారం. అందుకే సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు తాజాగా గుంటూరు కారం సినిమా కూడా అదే దారిలో వెళ్లింది. దీంతో నెటిజన్లు త్రివిక్రమ్ ను ఆడేసుకుంటున్నారు.
త్రివిక్రమ్ లో పస తగ్గిందని చెబుతున్నారు. అందుకే పంచ్ డైలాగులు కనిపించడం లేదని అంటున్నారు. సినిమా విజయంలో మాటలే కీలక పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు. ఆయన గత చిత్రాల్లో మాటల గారడీతోనే సక్సెస్ అయ్యార. కానీ ప్రస్తుతం ఆ ట్రెండ్ కనిపించడం లేు. ఏదో రాశాం లే అనే కోణంలోనే తన డైలాగులు ఉంటున్నాయి. దీంతో సినిమాలు ప్లాప్ లు మూటగట్టుకుంటున్నాయి.
మహేష్ బాబుతో తీసిన గుంటూరు కారం కూడా అప్రదిష్ట మూటగట్టుకుంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో చేసేటప్పుడు ఇంత జాగ్రత్తగా ఉండాలి. వీరి కలయికలో అతడు, ఖలేజా, గుంటూరు కారం వచ్చాయి. ఇందులో అతడు తప్ప రెండు సినిమాలు పరాజయాన్ని ఎదుర్కొన్నాయి. దీంతో త్రివిక్రమ్ కు స్టార్ హీరోలను డైరెక్ట్ చేయడం కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలో గుంటూరు కారంను ఓటీటీలో విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్లలోనే త్రివిక్రమ్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేసిన నెటిజన్లు ఇప్పుడు ఎలా ఏకిపారేస్తారో తెలియడం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్కూల్లో కథలు దొరకడం లేదని ఏదో ఓ కథతో ముందుకు వస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని చెబుతున్నారు.