Guntur Kaaram : త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో విషయం లేకపోయినా హిట్ సాధిస్తుంటాయి. కథలో బలం లేకున్నా అటు ఇటు తిప్పి నడిపించడం ఆయనకు అందెవేసిన చేయి. అందుకే ఆయన సినిమాలు బాక్సాఫీసు దగ్గర విజయం సాధిస్తుంటాయి. అలా ఆయన కలం నుంచి జాలువారిన సినిమాలెన్నో హిట్లు సాధించడం గమనార్హం. ఈనేపథ్యంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం చప్పగా ఉందని పెదవి విరుస్తున్నారు. సినిమాలో ఎలాంటి మసాలే లేదని నిట్టూరుస్తున్నారు.
త్రివిక్రమ్ గత సినిమాలు ఒక దాని మించి మరోటి హిట్ సాధించడం విశేషం. అతడు, అరవింద సమేత, అత్తారింటికి దారేది?, అల వెంకటాపురంలో వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. మహేష్ బాబుతో తీసిన ఖలేజా, పవన్ కల్యాణ్ తో చేసిన అజ్ణాతవాసి, ఇప్పుడు మహేశ్ బాబుతో నిర్మించిన గుంటూరు కారం నిరాశపరచడం ఆయన కలానికి చెడ్డ పేరు తీసుకొచ్చాయి.
గుంటూరు కారంలో కొత్తదనం లేదు. స్క్రీన్ ప్లేలో బలం లేదు. పాత్రలకు డైలాగులు కూడా లేవు తన గత చిత్రాలకు భిన్నంగా అజ్ణాతవాసిని మరిపించేలా తీశారనే టాక్ వస్తోంది. అన్ని పాత్రలకు రెండు మూడు డైలాగులు మాత్రమే పెట్టి కథ నడిపించడం ఆయన మొండితనానికి ప్రతీకగా చెబుతున్నారు. కథలో మంచి పట్టు ఉంటే హిట్ అవుతుంది. లేదంటే ఫట్ అవడం ఖాయం.
కథ విషయంలో త్రివిక్రమ్ ప్లాఫ్ అయ్యారు. కథ రెండు ఇళ్ల మధ్య తప్ప మరో గడప చూపించలేదు. కథతో సంబంధం లేకుండా పాత్రలు కల్పించారు. దీంతో సినిమా అట్టర్ ప్లాఫ్ అని అంటున్నారు. త్రివిక్రమ్ లాంటి ఫేమస్ డైరెక్టర్ ఇలాంటి ప్లాఫ్ చిత్రాలు చేస్తే హీరోలు ఆయనతో చేయడానికి వెనకాడటం సహజం. వచ్చే చిత్రాలైనా సరిగా చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.