Mahesh Babu Guntur Kaaram :మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా గుంటూరు కారం. సినిమా చిత్రీకరణ మొదటి నుంచి ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉంది. రెండడుగులు ముందుకు నాలుగడుగులు వెనక్కి వెళ్తోంది. దీంతో సినిమా పూర్తవుతుందా? లేదా? అనేది అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గుంటూరు కారం సినిమా నిలబడుతుందా? అనుకున్న సమయానికి విడుదలవుతుందా? అనేదాని మీద చర్చ సాగుతోంది.
గుంటూరు కారం సినిమా ఆది నుంచి అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఏ ముహూర్తంలో సినిమా మొదలు పెట్టారో కానీ ఎప్పుడు సరిగా సాగడం లేదు. మహేష్ బాబు కొద్ది రోజులుగా విదేశాల్లో ఉండటంతో సినిమా షూటింగ్ మొదటికొచ్చింది. తరువాత షెడ్యూల్ ను ఎప్పుడు కొనసాగిస్తారో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నా ఎందుకో ముందుకు సాగడం లేదు.
ఇదివరకు సినిమా ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. థమన్ ను సంగీత దర్శకుడిగా పక్కన పెట్టేశారని అన్నారు. ఫొటోగ్రాఫర్ ను సైతం తీసేశారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో గుంటూరు కారంపై పలు సందేహాలు వస్తున్నాయి. కానీ వీటన్నింటికి ఒకే షెడ్యూల్ తో సమాధానం చెప్పాలని గురూజీ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో గుంటూరు కారం సినిమాను త్వరగా నిర్మించాలని చూస్తున్నారు.
ముందు చెప్పినట్లు సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ నెల 20 నుంచి మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఒకేసారి షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో నిలపాలని ఆలోచిస్తున్నారు. దీంతో మహేష్ బాబుల ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు అవుతుందని అంటున్నారు.