“Guntur Karam” :
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ మాస్ మసాలా మూవీ ”గుంటూరు కారం”.. హారిక హాసిని బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రెండు మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.. బాగానే ఉంది..
అయితే ఈ సినిమాకు ఇంత వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఏ సినిమా షూటింగుకు రానన్ని అవాంతరాలు వస్తున్నాయి.. ఈ సినిమా అసలు ఉందా? లేదా? పూర్తిగా ఆగిపోయిందా అనే కొత్త కొత్త డౌట్స్ కూడా ఫ్యాన్స్ కు సైతం కలుగుతున్నాయి.. ఈ విషయం మీదనే సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది.
ముందుగా కథ రాసుకుని కొన్ని సీన్స్ తెరకెక్కించిన తర్వాత మహేష్ కు నచ్చలేదని కథ మార్పించడంతో ఆ సీన్స్ వృధా అయ్యాయి.. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్ పి ఎస్ వినోద్ తప్పుకోగా ఆయన స్థానంలో రవి కె చంద్రన్ వచ్చారు.. ఇక పూజా హెగ్డే తప్పుకోగా మీనాక్షి చౌదరి ఎంటర్ అయ్యింది.. థమన్ కూడా తప్పుకున్నాడంటూ వార్తలు వైరల్ కాగా ఆయన క్లారిటీ ఇచ్చారు..
వాస్తవానికి ఏ సినిమాకు కూడా ఇన్ని విషయాలు జరగలేదు.. సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఏదొక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ప్రజెంట్ అకస్మాత్తుగా మహేష్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ ట్రిప్ వెళ్లి అక్కడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.. ఒకవైపు ఈయన బర్త్ డే కానుకగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తారని కొందరు లేదు ట్రైలర్ వస్తుందని కొందరు మాట్లాడు కుంటున్నారు. మొత్తానికి మేకర్స్ ఇది అని క్లారిటీ ఇస్తే కానీ ఈ సినిమాపై రూమర్స్ ఆగేలా లేవు..