India vs Pakistan :
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరికి ఇష్టమే దీంతో రెండు దేశాల వారికి మ్యాచ్ అంటే ఆసక్తి చూపడం సహజం. దాయాది దేశాల మధ్య పోరు రసవత్తరంగా ఉంటుంది. చివరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగడం కామన్. ఈ నేపథ్యంలో ఆసియా కప్ లో భాగంగా పాక్ తో జరిగే మ్యాచ్ రెండు దేశాలకు కనులవిందుగా మారనుంది. సెప్టెంబర్ 10న జరిగే పోరు కీలకంగా మారనుంది.
సూపర్ 4లో భాగంగా భారత్, పాక్ మధ్య జరిగే పోరు కోసం రెండు దేశాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. రెండు దేశాలు విజయంపై కన్నేశాయి. పాకిస్తాన్ ఇప్పటికే బంగ్లాదేశ్ ఆడిన మ్యాచ్ లో విజయం సాధించి రెండు పాయింట్లు తెచ్చుకుంది. ఇప్పుడు భారత్ తో జరిగే మ్యాచ్ కు ప్రాధాన్యం ఏర్పడింది. గ్రూప్ దశలో రెండు జట్ల మధ్య జరిగిన పోరు వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఆదివారం జరిగే పోరు కోసం స్వల్ప మార్పులతో భారత్ సిద్ధమైంది.
శార్దూల్ ఠాకూర్ స్థానంలో బుమ్రాను తీసుకోవాలని చూస్తోంది. ఇటీవల బుమ్రా తండ్రయ్యాడు. దీంతో భార్య సంజన మగ బిడ్డను ప్రసవించడంతో హుటాహుటిన భారత్ కు బయలుదేరి వెళ్లాడు. సోమవారం నేపాల్ తో మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. సెప్టెంబర్ 10న జరిగే మ్యాచ్ కు బుమ్రా అందుబాటులో ఉండనున్నాడు. దీనివల్ల జట్టులో కేఎల్ రాహుల్ జట్టులో ఉండే విషయమై సందిగ్దత ఏర్పడుతోంది.
కేఎల్ రాహుల్ జట్టులో ఆడే విషయంపై అనుమానం వస్తోంది. పాకిస్తాన్ తో ఆడిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ రెచ్చిపోయి ఆడటంతో కేఎల్ రాహుల్ కంటే ఇషాన్ కే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రేయస్ అయ్యర్ బెంచికే పరిమితమయ్యే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లలో ఒకరు మాత్రమే ఆడే చాన్స్ ఉంది. అదే జరిగితే కేఎల్ రాహుల్ ను బెంచ్ కే పరిమితం చేయాలని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ మంచి రసవత్తరంగా కొనసాగే వీలుంది.