Kangana’s Shocking Comments :
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తాజా చిత్రం ‘చంద్రముఖి-2’. పి.వాసు దర్శకత్వంలో లారెన్స్.. కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘చంద్రముఖి-2’ సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం చైన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు చిత్రబృందం సమాధానాలు ఇచ్చింది.
ఈ క్రమంలోనే కంగనా రనౌత్ ప్రస్తుత రాజకీయాలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాను అసలు సిసలైన దేశ భక్తురాలినని.. అందుకే తనవంతుగా పేదలకు తోచిన సహాయం చేస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో తనకు అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి రాజకీయాల్లో వస్తే.. సినిమాలు వదులుకోవాలని జనసేన అధినేతపై పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను ఆమె ముందు ప్రస్తావించారు.
దీనికి కంగనా సమాధానం ఇస్తూ.. రోజా అంటే ఎవరో తనకు తెలియదని చెప్పారు. అలాంటివారు ఉన్నారన్న విషయమే తనకు తెలియదని చెప్పారు. అలాంటప్పుడు ఆమె గురించి తానేం మాట్లాడనని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. రోజాపై కంగనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రోజా ఎవరో తెలియదని కంగనా చెప్పడంతో ఆమె పరువుపాయే అన్నట్లుగా మారింది. రాజకీయ నాయకులు.. సినిమా వాళ్లపై ఒంటికాలిపై లేచే రోజా ఇప్పుడు కంగనా విషయంలో ఎలా స్పందిస్తుందనే మాత్రం వేచిచూడాల్సిందే..!