Minister Seethakka : తెలంగాణ రాష్ట్రంలో అనాధ పిల్లలకు అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల ప్రవేశాలలో 2 శాతం కోటా కేటాయించేలా కసరత్తు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్ల వద్ద అంగన్వాడి కేంద్రాలు ఉండేలా అధికారులు చొరవ తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అంగన్వాడీలకు స్థానిక మండలాల నుంచి పాలు సరఫరా చేయాలని తెలిపారు.
అనాధ పిల్లల దత్తత నిబంధనలు సులభతరం చేయాలని అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశిం చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రజల కష్టాలను పరిష్కరించే దిశలో ముందుకు సాగుతుందని అర్థమవుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ ప్రజలకు మేలు చేస్తుం ది. రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరు ఎంతో బాధ్యతగా తమ పరిపాలనను నిర్వహిస్తున్నారు.
గత బిఅర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంక్షేమ పథకాలు అందక చాలా ఇబ్బందులకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.