చందమామపై కాలు మోపాలన్న ఇస్రో ఆశలు తీరడం లేదు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న చంద్రయాన్ 2 యాత్ర మరోమారు నిరాశ కలిగించింది. జపాన్ సాంకేతిక సహకారంతో ముందుకు వెళ్లినా మన శాస్త్రవేత్తల కోరిక తీరడం లేదు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల కింద ప్రయోగించిన చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై క్రాష్ ల్యాండ్ అయింది. చందమామ ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్ నుంచి సంకేతాలు అందలేదు. దీంతో దాని శకలాలు గుర్తించారు.
జపాన్ కు చెందిన ప్రైవేటు సంస్థ సహకారంతో పంపించిన స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై చేరకుండానే క్రాష్ అయింది. దీంతో చంద్రుడిపై కాలు మోపాలనే మన వారి ఆశలు గల్లంతయ్యాయి. ఐ స్పేస్ అనే ప్రైవేటు స్టార్టప్ ఈ మిషన్ ను ప్రారంభించింది. డిసెంబర్ 11న ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి స్పేస్ ఎక్స్ తయారు చేసిన తయారు చేసిన ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో ఈ ల్యాండర్ చంద్రుడిపైకి పంపింది.
దీనిపేరు హకుటో ఆర్ -1. దీనికి అవసరమైన రోవర్ ను యూఏఈ అందించింది. దీని సాయంతో నెల రోజుల తరువాత చంద్రుడి కక్ష్యలోకి అడుగు పెట్టినా క్రాష్ కావడంతో కథ మొదటికొచ్చింది. ఇంతవరకు చంద్రుడిపై విజయవంతమైన ప్రయోగాలు చేసింది అమెరికా, రష్యా, చైనా మాత్రమే. ఇండియా కూడా ఆ స్థానం భర్తీ చేయాలని భావించినా కుదరడం లేదు.