Naga Chaitanya : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంటరయ్యాడు అక్కినేని నాగ చైతన్య. తొలి సినిమా నుంచే విలక్షణ స్టోరీలతో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. జోష్ సినిమాతో టాలీవువడ్ లో అడుగుపెట్టిన చైతూ తక్కువ టైమ్ లోనే స్టార్ హీరో స్టేటస్ పొందాడు. వరుసగా ఫ్లాపులు పలకరించినా వెనక్కి తగ్గలేదు. ఓటీటీ ప్లాట్ ఫాంలో దూత వెబ్ సిరీస్ తో మళ్లీ సక్సెస్ సాధించాడు. అదే జోష్ తో తండేల్ సినిమా చేస్తున్నాడు చైతూ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నది. ఈ సినిమా పూర్తి కూడా కాకముందే మరో సినిమాను లాక్ చేసుకున్నాడు.
డిఫరెంట్ స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటూ అన్ని చిత్రాలు హిట్ అయ్యేలా ప్లానింగ్ చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని సబ్జెక్టుతో సరికొత్త కథాంశంతో రాబోతున్నాడు. మిథికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించకున్నాడు. ఆ సినిమా దర్శకుడు, హీరోయిన్.. టీమ్ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.
చైతూ ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవితో కలిసి తండేల్ మూవీ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. శరవేగంగా ఈ షూటింగ్ జరగుతున్నది. ఈ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాకు సైన్ చేశాడు. విరూపాక్ష సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ కార్తీక్ వర్మ దండుతో కలిసి నాగ చైతన్య టై అప్ అయ్యాడు.
మిథికల్ థ్రిల్లర్ జోనర్ లో సినిమా ఉంటుందని తెలుస్తున్నది. ఈ సినిమాకు హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేసుకున్నట్లు టాక్. ఇప్పటికీ ఆ హీరోయిన్ చైతులో కలిసి ఓ సినిమా చేసింది. ఒక లైలా కోసం సినిమాలో హీరోయిన్ గా చేసిన పూజా హెగ్డే ఈ సినిమాలో ఫిమే ల్ లీడ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ అధినేత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లే చాన్స్ ఉంది. 2026లో ఈ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్.