Nirmala : బాల్య వివాహాన్ని ఎదిరించిన ఓ బాలిక ఇంటర్మీడియెట్ ఫలితాల్లో తన సత్తా చాటింది. కర్నూలు (డి) ఆదోనికి చెందిన నిర్మల పదవ తరగతి ఫలితాల్లో 537 మార్కులు సాధించింది. అయితే ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. తనకు పెళ్లి ఇష్టం లేదని స్థానిక ఎమ్మెల్యేను ఆశ్రయించి ఐపిఎస్ కావడమే తన ధ్యేయమని చెప్పింది. దీంతో ఎమ్మెల్యే కెజిబివిలో చేర్పించగా నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో నిర్మల 440 మార్కులకు గాని 421 మార్కులు సాధించి తన జీవిత లక్ష్య సాధనలో ముందుకు సాగుతోంది.
Breaking News