AP Inter Results : ఫస్ట్ ఇయర్ లో 67.. సెకండ్ ఇయర్ లో 78 శాతం మొత్తం ఉత్తీర్ణత. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ లో మొత్తం 9.99 లక్షల మంది పరీక్ష రాయగా ఫస్ట్ ఇయర్ లో 67 శాతం, సెకండ్ ఇయర్ లో 78 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. అయితే ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు.
సెకండ్ ఇయర్ లో 81 శాతం అమ్మాయిలు, 75 శాతం అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు. ఫస్గ్ ఇయర్ లో 71 శాతం అమ్మాయిలు, 64 శాతం అబ్బాయిలు పాసయ్యారు. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.