Bhashyam Praveen : పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరు గ్రామంలోని ఇమ్మానుయేలు లూథరన్ చర్చిలో ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిలో పెదకూ రపాడు టిడిపి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసుక్రీస్తు మృతి చెంది మూడవరోజు సజీవుడుగా నిలిచిన ఈ రోజు క్రైస్తవులు పునరుర్థాన పండుగగా జరుపుకుం టారు. పవిత్రమైన ఈ రోజున క్రైస్తవులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పండుగను జరుపు కుంటారు.
ఈస్టర్ పండగ రోజున పెదకూరపాడు ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ చర్చిలో జరిగే ప్రార్థనలో పాల్గొని ప్రసంగించారు. ఈస్టర్ పండగ రోజు లూథ రన్ చర్చిలో పాల్గొనడం తనకెంతో సంతో షంగా ఉందని భాష్యం ప్రవీణ్ తెలిపారు. ఈస్టర్ యొక్క ప్రత్యేకత గురించి భాష్యం ప్రవీణ్ మాట్లాడారు. ఏసు క్రీస్తు చనిపోయి మూడవ రోజున తిరిగి లేచా డని ఆయన మరణమును జయించిన పునరుద్దా నుడై తిరిగి లేచాడని ఆయన గుర్తుచే సుకున్నా రు.
అందుకే మనం ఈస్టర్ పండగజరుపుకుంటు న్నామని ఏ సుక్రీస్తు చూపిన మార్గం ఏంటంటే ఈ లోకంలో ప్రేమ శాంతి సమాధానంతో జీవించమని చెప్పారని ఆయన తెలిపారు. భాష్యం ప్రవీణ్ మాట్లాడిన తర్వాత చర్చిలో పాస్టర్లు ఆయన గెలుపు కోసం దేవుని ప్రార్థించారు.
చర్చిలో పాల్గొన్న వారందరూ కూడా నా కోసం ప్రార్థన చేయాలని భాష్యం ప్రవీణ్ వారికి విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ప్రచారంలో దూసుకుపోతు న్నారు. అన్ని వర్గాల నుంచి ఆయనకు విశేషమైనటువంటి స్పందన లభిస్తోంది.