మరోవైపు ఈ నటుడి మరో సినిమా #OG వార్తల్లో నిలిచింది. 4వ, కీలక షెడ్యూల్ విజయవంతంగా పూర్తయినట్లు దర్శకుడు సుజీత్ అధికారికంగా ప్రకటించారు. ఈ షెడ్యూల్ లో ప్రధాన పాత్రధారులకు సంబంధించిన ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించారు. వచ్చే నెలలో కొత్త షెడ్యూల్ మొదలవుతుందని, పవన్ కళ్యాణ్ కూడా సెట్స్లో జాయిన్ అవుతారని తాజా సమాచారం.
ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. 2023 డిసెంబర్ లేదా 2024 ఏప్రిల్ లో సినిమా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ReplyForward
|