MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు కోడానికి పార్టీలు ప్రయత్నిస్తాయి. రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా మహిళా ఓట్లపై ఆధారపడి పార్టీలు ప్రచారం చేస్తాయి. వాళ్లకు అనేక హామీలు ఇస్తాయి. ఆకట్టుకోడానికి ఎన్నెన్నో వాగ్దానాలను గుప్పిస్తారు. అంతటితో ఆగకుండా పోలింగ్ కు రెండు, మూడు రోజుల ముందు చీరలు, కుంకుమ భరణి, మిక్సీ లు పంపిణీ చేసి ఆకట్టుకొని ఓట్ల శాతం పెంచుకోడానికి ప్రయత్నాలు చేస్తారు. మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలను తీసుకువస్తామని హామీ ఇస్తారు. ఉన్న చట్టాలు కాకుండా, మరికొన్ని కొత్త చట్టాలను తీసుకువచ్చి మీకు అండగా మేము ఉన్నామంటూ మహిళలను ఆకట్టుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఎక్కడ కూడా పురుషుల కోసం ఒక్క మాట కూడా మాట్లాడరు నాయకులు.
ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా పురుషుల సంక్షేమం కోసం నాయకులు మాట్లాడక పోయేసరికి అక్కడి మగాళ్లకు కోపం వచ్చింది. ఇంకేముందు పురుషుల హక్కుల సాధనే మా ద్యేయం అంతో కొత్త పార్టీ వెలసింది. రాంచి,లక్నో,గోరఖ్ పూర్ నియోజక వర్గాల్లో పురుషుల హక్కుల సాధన కోసం కొందరు కలిసి పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు మేరా అధికార్ రాష్ట్రీయ దళ్ (MARD ). ఈ పార్టీ 2018 లో ఆవిర్భవించింది. పార్టీ స్థాపించిన నాటి నుంచి పోటీ చేస్తూనే ఉంది. తాజా ఎన్నికల్లో కూడా రాంచి, లక్నో, గోరఖ్ పూర్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీలో నిలిపింది. కానీ పార్టీ స్థాపించిన నాటి నుంచి 2019 ఎన్నికల వరకు అభ్యర్థులను బరిలో దింపినా ఒక్క ఎన్నికల్లో కూడా ఒక్కరు కూడా విజయం సాధించలేదు. కనీసం ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కలేదు. అయినప్పటికీ మేర అధికార్ రాష్ట్రీయ ధల్ తన అభ్యర్థులను మరోసారి బరిలోకి దింపింది.
MARD పార్టీ తన ప్రచారంలో పురుషుల హక్కుల కోసం ఏర్పాటు చేసినట్టుగా విస్తృత ప్రచారం చేస్తోంది. తమ పార్టీ అభ్యర్థులు గెలిస్తే పురుషుల హక్కుల కోసం ప్రత్యేకంగా మంత్రిని ఏర్పాటు చేస్తాం. అంతే కాకుండా ఒక శాఖ ను కూడా ఏర్పాటుచేసి హక్కులను కాపాడుతాం. జాతీయ స్థాయిలో కుడా పురుషుల కమిషన్ ఏర్పాటుచేసి తీరుతామని చేస్తున్న ప్రచారం ఆ నియోజక వర్గాల్లో ఆకట్టుకోవడం విశేషం.