Election Notification : 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 లోక్ సభ స్థానాలకు నేడు రెండో విడత ఎన్నికల నోటిఫి కేషన్ వెలువలనుంది. ఏప్రిల్ 4వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని అధికారులు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 6 తేదీన నామినేషన్లు పరిశీలన జరుగుతుండగా మిగతా రాష్ట్రాల్లో ఐదవ తేదీనే స్క్రూటినీ నిర్వహిస్తారు. అస్సాం, బీహార్, చత్తీస్గడ్, కర్ణాటక, కేరళ ,మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర, యూపి, బెంగాల్ ,మణిపూర్ జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికలకు రెండో విడతలో భాగంగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయబో తోంది. 12 రాష్ట్రాల్లో రెండో విడతలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించి నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. మొత్తం మీద 88 లోక్సభ స్థానాలకు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ మరికొద్ది సేపట్లో వెలువలనుంది.