IPL 2024 : ఐపీఎల్ 2024లో భాగంగా కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ సంచలన విజయం నమోదు చేసింది. 262 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపించారు.
262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభు సిమ్రాన్ (54) అర్థ సెంచరీతో వీర విహారం చేశాడు. ఆ తర్వాత జానీ బెయిర్ స్టో (108) సెంచరీతో చెలరేగాడు. అతని ఇన్నింగ్స్ లో 9 సిక్సులు, 8 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత రీలే రోసో (26) పరుగులు చేశాడు. శశాంక్ సింగ్ (68) పరుగులతో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను 8 సిక్సులు, 2 ఫోర్లు బాదాడు. ఈ మ్యాచ్ లో అత్యధికంగా 42 సిక్సులు నమోదయ్యాయి. కోల్ కతా బౌలింగ్ లో కేవలం సునీల్ నరైన్ ఒక్కడే ఒక్క వికెట్ తీశాడు. మిగతా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. కోల్ కతా భారీ స్కోరు చేసినప్పటికీ.. పంజాబ్ ఈ స్కోరును చేధించడంతో ఓడిపోక తప్పలేదు.