Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబయి ఇండియన్స్ మధ్య వాంఖడేలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి పీల్డింగ్ ఎంచుకున్న లోకల్ టీం ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను ముప్ప తిప్పలు పెట్టింది. నువాన్ తుషారా వైడ్ బాల్స్ తో ఇబ్బంది పడినా మరో వైపు బుమ్రా, చాహ్లా, హర్దిక్ పాండ్యా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి సన్ రైజర్స్ ఆట కట్టించారు.
చివర్లో సన్ రైజర్స్ కెప్టెన్ కమిన్స్ రెండు సిక్సులు, రెండు ఫోర్లతో 35 పరుగుల వీరోచిత ఇన్సింగ్స్ ఆడటంతో సన్ రైజర్స్ 174/9 తో ఇన్సింగ్స్ ను ముగించింది. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో హెడ్ 48 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు చేతులేత్తయడంతో సన్ రైజర్స్ తడబడింది. హర్దిక్ పాండ్యా, చావ్లా చెరో మూడు వికెట్లు తీసి సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ ను కుప్పకూల్చారు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ముంబయి బ్యాట్స్ మెన్స్ ను సన్ రైజర్స్ బౌలింగ్ విభాగం మొదటి నాలుగు ఓవర్ల వరకు నిప్పులు చెరిగే బంతులతో హడలెత్తించింది. నాలుగు ఓవర్లలోనే 31/3 తో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, నమన్ దిర్ ల వికెట్లను పడగొట్టి గెలిచేలా కనిపించింది. ఆ తర్వాత వచ్చిన సూర్య, తిలక్ వర్మ ఇద్దరు మొదట్లో క్రీజులో కుదురుకోవడానికే ప్రయార్టీ ఇచ్చారు.
అయితే మార్కోె జాన్సన్ వేసిన ఓవర్ లో రెండు ఫోర్లు ఓ సిక్సుతో బాదుడు ప్రారంభించిన సూర్య అక్కడి నుంచి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అప్పటి వరకు స్లో గా ఉన్న వికెట్ పై కూడా చెలరేగి ఆడొచ్చని నిరూపించాడు. ఏకంగా ఆరు సిక్సులు, 12 ఫోర్లు బాది 102 పరుగులు చేసి ముంబయి ఇండియన్స్ పరువు కాపాడాడు. సూర్య కు తోడుగా తిలక్ వర్మ 35 పరుగులతో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ విజయంతో ముంబయి నాలుగు విజయాలతో చివరి స్థానం నుంచి 9 వ ప్లేస్ కు రాగా.. గుజరాత్ 10 వ స్థానానికి పడిపోయింది. సన్ రైజర్స్ నాలుగో స్థానంలోనే కొనసాగుతుంది.