Software Engineer Suicide : ఆన్ లైన్ గేమ్ లకు ఆలవాటుపడిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా గంగాధరలోని మధురానగర్ కు చెందిన పృథ్వీ ఏడాది క్రితం హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరాడు. అయితే విధుల కోసం నోయిడాకు వెళ్లాలని కంపెనీ సూచించడంతో రెండు నెలల క్రితం అక్కడికి వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉండేవాడు. ఈ క్రమంలో ఆయన ఆన్ లైన్ గేమ్ లకు అలవాటుపడ్డాడు. ఆన్ లైన్ గేమ్ ల కోసం ఏకంగా 12 లక్షల రూపాయలు స్నేహితుల వద్ద అప్పు చేశాడు.
ఆన్ లైన్ గేమ్ లో డబ్బులు పోగొట్టుకున్న పృథ్వీ మానసిక ఆందోళనకు గురయ్యాడు. అప్పులు చెల్లించాల్సి రావడం, మానసికంగా ఒత్తిడి పెరగడంతో గదిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నోయిడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.