Father Killed Son : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. చింతకుంట గ్రామానికి చెందిన శివసాయి (21) హైద్రాబాద్ లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శివసాయి ఉద్యోగం చేస్తూనే ఆన్ లైన్ గేమ్ లకు అలవాటు పడ్డాడు. ఇంట్లో శుభకార్యంలో పాల్గొనడానికి బుధవారం గ్రామానికి వచ్చిన శివసాయి ఆన్ లైన్ గేమ్ లు ఆడుతూనే ఉన్నాడు. గమనించిన తండ్రి మందలించాడు.
ఫంక్షన్ ముగియడంతో హైదరాబాద్ వెళ్తాననడంతో గ్రామంలోనే ఉండాలని, ఆన్ లైన్ గేమ్ లు ఆడడం మానివేయాలని తండ్రి శ్రీనివాస్ చెప్పపడంతో ఇద్దరికీ గొడవ జరిగింది. పైగా తండ్రి పేరిట ఉన్న భూమిని అమ్మాలని శివసాయి ఒత్తిడి చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శివసాయి కండ్లలో కారంపొడవి చల్లి, రోకలిబండతో తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన శివసాయి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి శ్రీనివాస్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.