PM Modi Range America : ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన ముందుగా న్యూయార్క్ లో పర్యటించారు. ఆ తర్వాత వాషింగ్టన్ చేరుకున్నారు. ఆయన పర్యటనకు ఇండియన్లే కాదు అమెరికన్లు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఆయన విశ్వగురువు అయ్యారు అంటూ బీజేపీ శ్రేణులు కొనియాడుతున్నాయి. మరోవైపు మోదీ తన పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడితో ప్రత్యేకంగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఇండియా, అమెరికా రక్షణ సంబంధిత విషయాలపై వారు ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు. ఆర్థిక అంశాలతో పాటు విదేశాంగ విధానం, భద్రతా పరమైన చర్యలు, ఉగ్రవాదం తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు అక్కడి మీడియా తెలిపింది.
అమెరికాలో పోప్ పర్యటన కంటే మోదీ పర్యటనకు క్రేజీ ఎక్కువగా ఉన్నట్లు అక్కడి మీడియా చెబుతున్నది. అక్కడి సభలకు హాజరైన వారిని చూస్తేనే అర్థమవుతున్నది. వైట్ హౌస్ లో మోదీకి అక్కడి అధ్యక్షుడు జో బైడెన్ ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రధాని మోదీ కోసం స్పెషల్ విందు ఇచ్చారు. ప్రత్యేక బహుమానాలు ఇచ్చారు. అయితే కొందరు మోదీ అమెరికా పర్యటనను వ్యతిరేకిస్తున్నా, అక్కడ మాత్రం ఆయనకు ఘన స్వాగతం పలుకుతుంది. వేలాది మంది మోదీ రాకకోసం వేచి ఉండడం, ఆయనకు ఉన్న క్రేజీని తెలుపుతున్నది.
అమెరికా పర్యటనలో ఉన్న మోదీని ఎన్ఆర్ఐలు ప్రత్యేకంగా కలిశారు. అందులో తెలుగు రాష్ర్టాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇండియా ఘనతను తెలియజేస్తూ మోదీ పర్యటన ఆద్యంతం కొనసాగుతున్నది. భారతమాతాకీ జై.. జైజై మోదీ అంటూ మోదీ సభల ప్రాంగణాలు మార్మోగుతున్నాయి. అయితే వాషింగ్టన్ ఇప్పటికే పెద్ద సంఖ్యలో భారతీయులు చేరుకున్నారు. వారంతా మోదీని కలుసుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. గతంలో ఏ ప్రధానికి దక్కని గౌరవం మోదీకి దక్కుతున్నదని అమెరికన్ మీడియా చానళ్లు ప్రసారం చేశాయి. భారత్, అమెరికా సంబంధాల బలోపేతం కోసమే ఆయన అక్కడ పర్యటిస్తున్నారని అమెరికాలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధులు వెల్లడించారు.