Postal Ballot : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనెల 13న ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయబోతోంది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ డిపార్టుమెంట్ సంయుక్తంగా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి 13న ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. కాబట్టి ఆరోజు ఉద్యోగులు, పోలీసులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ పద్దతి ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే విదంగా ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీస్ శాఖల వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ లో పాల్గొని ఓటు వేశారు.. పోస్టల్ బ్యాలెట్ పద్దతిలో సుమారుగా ఐదు లక్షల మందికి పైగా పోలింగ్ లో పాల్గొని ఓటు వేశారు.
రాష్ట్రం విభజన జరిగిన తరువాత అధికారం చేపట్టిన చంద్రబాబు ఉద్యోగులను పట్టించుకోలేదని, క్రమశిక్షణ పేరుతో కఠినంగా వ్యవహ రించారనే పేరు ఉంది. వేతనాల విషయంలో కూడా ఇబ్బంది పెట్టిన విషయాన్నీ నేటికీ మరచిపోలేదు. తిరిగి మరోసారి ఆయనే అధికారం చేపడితే తిప్పలు తప్పవనే భావం ఉద్యోగ,ఉపాధ్యాయ వర్గాల్లో ఉంది. అందుకని ఆదివారం నాటి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో అత్యధికంగా వైసీపీ పార్టీ కే ఓట్లు వేసినట్టుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకనే టీడీపీ కి ఓటు వేయడం ఇష్టం లేదని కూడా బాహాటంగానే ఉద్యోగ,ఉపాధ్యాయ వర్గాల్లో కొందరు చర్చించుకుంటున్నారు.
జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఉద్యోగులకు గ్యారెంటెడ్ ఫెన్సన్ స్కీమ్ అమలు చేసారు. ఆ స్కీమ్ లాభసాటిగా ఉండటంతో వైసీపీ వైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థులు కూడా పోస్టల్ బ్యాలెట్ పై ధీమాలో ఉన్నారు. జనసేన,బీజేపీ,టీడీపీ పార్టీలు కలిసి ప్రకటించిన మేనిఫెస్టో ఉద్యోగులకు ఏ మాత్రం ఉపయోగంగా లేదని బాహాటంగానే పెదవి విరుస్తున్నారు. ఉద్యోగ,ఉపాధ్యాయ వర్గాలను సంతృప్తి పరిచేవిదంగా లేదంటూ ఆ వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కూటమి ప్రచారం చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల కోసం రాష్ట్ర బడ్జెట్ మొత్తం కేటాయించినా నిధులు సరిపోవని ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.