Railway Huge Success : నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి (2014) నుంచి అన్ని రంగాల్లో డెవలప్మెంట్ ఊహకందంత వేగంగా జరిగింది. ముఖ్యంగా రైల్వే గురించి చెప్పుకుంటే చాలా మార్పులు వచ్చాయి. మూడో లైన్.. స్పీడ్ ట్రేన్స్ ను పెంచడం.. వందే భారత్.. 5G రైల్వే ష్టేషన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు రైల్ ప్రయాణం అంటే సుఖవంతంగా.. తక్కువ ఖర్చుతో ఉంటుందని భారతీయులందరికీ తెలిసిందే.
అలాంటి రైల్వే డిపార్టమెంట్ మరో సరికొత్త రికార్డును సాధించింది. దేశంలో మొట్ట మొదటి నీటి అడుగున రైల్ ట్రాక్ వేసింది. హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ మధ్య ఈ ప్రమాణం కొనసాగుతుంది. జూన్, 2024 నాటికి హౌరా మైదాన్ మరియు సీల్దా మధ్య మొత్తం స్ట్రెచ్ను అమల్లోకి తేవాలని చూస్తోంది. ఎస్ప్లానేడ్ మరియు సీల్దా మధ్య సాగిన మార్గం అమల్లోకి వచ్చిన తర్వాత, హౌరా మైదాన్ మరియు ఎస్ప్లానేడ్ మధ్య సర్వీసుల ఫ్రీక్వెన్సీని పెంచుతామని కోల్కతా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (KMRCL) ఎండీ డైరెక్టర్ వీకే శ్రీవాస్తవ తెలిపారు.
ఈ కింది వీడియోలో రైలు ప్రయాణంలో బ్లూ (నీలం) లైట్లు వచ్చిన ప్రాంతం గంగా నది కింది నుంచి రైలు వెళ్తున్నట్లు సూచిస్తున్నాయి. ఇది ఇండియన్ రైల్వే చరిత్రలో అత్యద్భుతం భారత రైల్వే సాధించిన రికార్డు. ప్రస్తుతానికి మెట్రో రైల్ ను నడుపుతున్న రైల్వే శాఖ రాను రాను సర్వీసులను పెంచనున్నట్లు చెప్తున్నారు.