Rama Prabha : రమాప్రభ తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో పరిచయమున్న పేరు. రమాప్రభ మే 5, 1946 లో చిత్తూరు జిల్లా వాల్మీకి పురంలో జన్మించింది. అయితే కొంతమంది అనంతపురం కదిరిలో జన్మించిందని చెబుతుంటారు. రమాప్రభ తన మేనత్త వద్ద ఉంటూ 12 సంవత్సరాల వరకు పెరిగింది. మేనత్తకు పిల్లలు లేకపోవడంతో రమాప్రభను పెంచుకుంది. వీరు ఊటీలో ఉండేవారు. దీంతో రమాప్రభకు 12 ఏండ్లు వచ్చే సరికి తెలుగు కూడా సరిగా రాకపోయేది.
ఆమె 12 ఏండ్ల వయసులో మేనత్త భర్త కృష్ణదాస్ ముఖర్జీ చనిపోవడంతో తిరిగి స్వస్థలానికి వచ్చారు. రమాప్రభ 14 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు మద్రాస్ తీసుకొచ్చింది. మద్రాస్ లో నాటక సంస్థల్లో పని చేసింది. తమిళ డైరెక్టర్ కృష్ణన్ పంచు తమిళ మూవీలో మొదటి అవకాశం ఇచ్చారు. దాదాపు దక్షిణ భారతదేశంలో ఈమె తెలియని వారు ఉండరు. 1400 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి మెప్పించింది. హిరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక పాత్రల్లో ఒదిగిపోయింది.
అల్లు రామలింగయ్య, రాజబాబు తో చేసిన కొన్ని సినిమాలు ఎవర్ గ్రీన్. పద్మనాభం ప్రధాన పాత్రలో చిలకా గోరింకా సినిమాలో తెలుగులో మొదటి అవకాశం వచ్చింది. ఈ సినిమా చేసే సమయంలో రమాప్రభకు తెలుగు సరిగా రాదు. పద్మనాభం అప్పటికే స్టార్ కమెడియన్. ఈ సినిమా 1964 లో వచ్చి మంచి విజయం సాధించింది. అక్కడి నుంచి రమాప్రభ వెనుదిరిగి చూసుకోలేదు. పద్మనాభం, రమాప్రభ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్ని విజయం సాధించాయి.
తెలుగు సినిమాల్లో రమాప్రభ కోసం అల్లు రామలింగయ్య, రాజబాబులు పడే ఆరాటం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేంది. వీరి కోసం డైరెక్టర్లు ప్రత్యేకంగా సీన్లను రాసుకునే వారు. ముత్యాలు వస్తావా అంటూ అల్లు రామలింగయ్య డ్యాన్స్ చేసింది కూడా రమాప్రభ కోసమే. రమాప్రభ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో తన కంటే వయసులో చిన్న వాడైన శరత్ బాబును పెళ్లి చేసుకుంది. 14 సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత అతడితో విడాకులు తీసుకుని దూరమైంది. రమాప్రభ ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ నటి, ఉత్తమ నంది అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, ఎన్టీ రామారావు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. రమాప్రభ తన తోటి వాళ్లను నమ్మి ఆస్తులు అన్ని పోగొట్టుకుంది. ఓల్డేజ్ లో కూడా అదుర్స్ లాంటి సినిమాల్లో అద్బుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. రమాప్రభ సినీ పరిశ్రమలో చూసిన ఎత్తుపల్లాలు ఎవరూ చూసి ఉండరు. డబ్బులు లేని సమయంలో తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనకు సాయం చేశాడని తానే స్వయంగా వెల్లడించింది.