Gaddar : ప్రజానాయకుడు గద్దర్ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విని తెలంగాణ ఉలిక్కిపడింది. ఒక ఉద్యమ నాయకుడిని కోల్పోయింది. తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది.
గద్దర్ మరణానికి కారణాలేంటని ఆలోచిస్తే ఆయనకు గుండె జబ్బు ఉందని తెలుస్తోంది. జులై 20న అపోలో ఆస్పత్రిలో గుండె నొప్పి రావడంత చేరారు. ఆగస్టు 3న గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆయనను ఇంటికి పంపించారు. కోలుకుంటున్న సమయంలో ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
దీంతో పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చేరినా పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ప్రజాయుద్ధ నౌకగా పేరు తెచ్చుకున్న గద్దర్ తన పాటలతో ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన గళం చాలా పాపులర్ అయింది. ఆయన గళం విప్పితే ప్రజలు మంత్రముగ్దులు కావాల్సిందే. అలా గద్దర్ ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి. నిరంతరం ప్రజాభ్యుదయమే ధ్యేయంగా ముందుకు వెళ్లారు.
ఆదివారం ఉదయం బీపీ పెరగడంతో పాటు షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయాయి. వైద్యులు చికిత్స అందించినా ఆరోగ్యం కోలుకోకపోవడంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయన శరీర అవయవాలు మొత్తం దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. గద్దర్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.