Sajjala Comments against Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు వివిధ స్కాంలు చేశాడంటూ వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తున్నది. ఇప్పటికే ఆయనపై స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం అంటూ వివిధ కేసులను ఓపెన్ చేసింది. మరోవైపు అంగళ్ల అల్లర్ల కేసులో ఏ 1గాప్రజెంట్ చేసింది. మరిన్ని కేసులు కూడా వేయాలని చూస్తున్నట్లు కనిపిస్తున్నది. సరిగ్గా ఎన్నికల సమయంలో వైసీపీ ఈ ప్లాన్ ను రెడీ చేసింది.
నలభై ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏండ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లకు పైగా ప్రతిపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయినా పార్టీని తన రాజకీయ చతురతతో కాపాడుకుంటూ వస్తున్నారు. తన హయాంలో ఎన్నో కంపెనీలు, పరిశ్రములు రాష్ర్టం వైపు చూసేలా చేసుకున్నారు. సంపద సృష్టి ఎలా చేయాలో తెలిసిన నేతగా ముద్ర పడ్డాడు. అలాంటి వ్యక్తిపై బురద జల్లేందుకు అధికారం ఉంది కదా అని కేసులు పెట్టుకుంటూ పోతున్నదని వైసీపీ పై టీడీపీ, జనసేన విమర్శలు చేస్తున్నాయి. తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని లక్షలాది కోట్లు వెనుకేసుకొని, ఈడీ, సీబీఐ కేసులతో సతమతమవుతున్న జగన్, ఆ ముద్రను రాష్ర్టంలో చంద్రబాబుకు కూడా అంటించాలని ప్రయత్నం చేస్తున్నారనే అపవాదు మూటగట్టుకున్నాడు.
ఇక తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారుగా, ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు కూడా దీనినే ధ్రువీకరిస్తున్నాయి. చంద్రబాబు అవినీతి పరుడు అని పదే పదే చెప్పాల్సి వస్తుందని, జనాల మెదడుల్లో చంద్రబాబుపై వ్యతిరేక ప్రచారం ఎక్కించడానికే తమకు సమయం సరిపోతుందని చెప్పుకొచ్చారు. అంటే దీని వెనుక ప్రభుత్వం ఎంత కుట్ర చేస్తుందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటున్నారు. అభివృద్ధి ప్రదాతగా, దార్శనికుడిగా, విజినరీ లీడర్ గా ఉన్న వ్యక్తి పై ఇంత కుట్ర చేస్తున్నామని, ప్రజల మనసుల్లో నుంచి ఆయనపై ఉన్న ఇష్టాన్ని తొలగించాలని ప్రయత్నం చేస్తన్నామని ఆయన నేరుగానే ప్రకటించడం ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు. ఏదేమైనా అంతిమంగా న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సజ్జల మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలతో తెగ వైరల్ అవుతున్నది. చంద్రబాబు పై బురద జల్లేందుకు తాము చేస్తు్న్న ప్రయత్నం ఏంటో సజ్జల అందులో నేరుగా పేర్కొనడాన్ని టీడీపీ శ్రేణులో ట్రోల్ చేస్తున్నాయి. ఇదండీ మరి వైసీపీ నేతల వక్రబుద్ధి అంటూ టీడీపీ ఆ వీడియో షేర్ చేస్తూ, చంద్రబాబుపై ప్రచారాన్ని తిప్పికొడుతున్నది.