TDP 2nd List : టీడీపీ రెండో జాబితా విడుదల చేసింది. 34 మందితో కూడిన ఈ జాబితాలో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉండడం గమనార్హం. అభ్యర్థుల్లో పీహెచ్.డీ చేసిన ఒక్కరికి అవకాశం లభించింది. 11 మంది పీజ చేసిన వారు ఉన్నారు. డిగ్రీ చేసిన వారు 9 మంది, ఇంటర్ అర్హత 8 మంది.. పది చదివిన వారు ఐదుగురు ఉండడం విశేషం.
ఫిబ్రవరి 24న 94 మందితో తొలి జాబితా ప్రకటించగా.. తాజాగా సెకండ్ లిస్ట్ లో 34 మందిని చేర్చారు. మరో 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
-టీడీపీ ప్రకటించిన ఆ 34 మంది వీరే..
●నరసన్నపేట – బగ్గు రమణమూర్తి
●గాజువాక – పల్లా శ్రీనివాసరావు
●చోడవరం – కె.ఎస్.ఎన్.ఎస్. రాజు
●మాడుగుల – పైలా ప్రసాద్
●ప్రత్తిపాడు – వరుపుల సత్యప్రభ
◆రామచంద్రపురం – వాసంశెట్టి సుభాష్
●రాజమండ్రి – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
●రంపచోడవరం – మిర్యాల శిరిష
●కొవ్వూరు – ముప్పిడి వెంకటేశ్వరరావు
●దెందులూరు – చింతమనేని ప్రభాకర్
●గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు
●పెదకూరపాడు – భాష్యం ప్రవీణ్
●గుంటూరు పశ్చిమ – పిడురాళ్ల మాధవీ
●గుంటూరు తూర్పు – మహ్మద్ నజీర్
●గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
●కందకూరు ౼ ఇంటూరి నాగేశ్వరరావు
●మార్కాపురం ౼ కందుల నారాయణరెడ్డి
●గిద్దలూరు ౼ ముత్తుముల అశోక్ రెడ్డి
●ఆత్మకూరు ౼ ఆనం రామనారాయణరెడ్డి
●కోవూరు ౼ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
●వెంకటగిరి ౼ కురుగొండ్ల లక్ష్మిప్రియ
●కమలాపురం ౼ పుత్తా చైతన్యరెడ్డి
●ప్రొద్దుటూరు ౼ వరదరాజులురెడ్డి
●నందికొట్కూరు ౼ గిత్తా జయసూర్య
●కదిరి – కందికుంట యశోదా దేవి
●పుట్టపర్తి – పల్లె సింధూరా రెడ్డి
●మంత్రాలయం – రాఘవేంద్ర రెడ్డి
●ఎమ్మిగనూరు – జయనాగేశ్వర రెడ్డి
●పూతలపట్టు – డాక్టర్ కలికిరి మురళీమోహన్
●సత్యవేడు – కోనేటి ఆదిమూలం
●శ్రీకాళహస్తి – బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
●చంద్రగిరి – పులివర్తి వెంకట మణి ప్రసాద్
●పుంగనూరు – చల్లా రామచంద్రారెడ్డి
●మదనపల్లి – షాజహాన్ బాషా.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో వారసులకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రకటించడం 34 మంది అభ్యర్థులు ఏడుగురు మహిళలు ఉన్నారు. వీరిలో తొలిసారి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులే ఎక్కువ. యువతకు 40 శాతం టికెట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఆ దిశగా ప్రస్తుతం ప్రకటించిన 34 మంది అభ్యర్థుల్లో ఎక్కువ శాతం మంది యువత.