TDP : ఏపీలో కొన్ని పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైసీపీ ఎంతకు తెగించినా, ఓటర్లను ప్రలోభ పెట్టని టీడీపీ గట్టి పోటీని ఇచ్చింది. అయితే అన్ని చోట్ల టీడీపీ గట్టి పోటీని ఇచ్చింది. అధికార పార్టీకి చుక్కలు చూపించింది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందిన అధికార పార్టీ ఈసారి ఎలాగైనా గెలవాలని కుతంత్రాలు, విచ్చలవిడి డబ్బుల పంపిణీ, బెదిరింపులకు దిగింది. అయినా టీడీపీ తనదైన సత్తా చాటింది. మరోసారి అధికార వైసీపీకి వణుకు పుట్టించింది. త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు టీడీపీ శ్రేణుల్లో జోష్ ను మరింత రెట్టింపు చేశాయి. గత ఎన్నికల్లో వైసీపీ గెల్చుకున్న ఏడు పంచాయతీలను ఈసారి టీడీపీ దక్కించుకోవడం ఇక్కడ విశేషం.
వైసీపీ మద్దతుదారులు 22 స్థానాలకే పరిమితమయ్యారు. అయితే గతంలో వైసీపీ గెలిచిన ఏడు పంచాయతీలను ఈ సారి టీడీపీ దక్కించుకోగా, మరొకటి టీడీప, జనసేన కలిసి దక్కించుకున్నాయి. మొత్తంగా 34 స్థానాల్లో 22 వైసీపీ, 9 టీడీపీ, 2 జనసేన, టీడీపీ కలిసి దక్కించుకున్నాయి. ఇక 243 వార్డులకు ఎన్నికలు జరగగా, వైకేపీ మద్దతుదారులు 141, టీడీపీ మద్దతుదారులు 90, జనసేన మద్దతుదారులు 5, ఇతరులు మిగతా చోట్ల గెలుపొందారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన బొప్పడం(శ్రీకాకుళం), శోభకోట(అల్లూరి సీతారామారాజు) కొరుప్రోలు(అనకాపల్లి), కావలిపురం(పశ్చిమగోదావరి), పాకాల(ప్రకాశం) లింగరాజు అగ్రహారం(శ్రీ పొట్టి శ్రీరాములు), జగంపల్లి(అనంతపురం) లను టీడీపీ గెలిపించుకుంది.