Jagityal News : జగిత్యాలలో పదవ తరగతి చదువు తున్న అమ్మాయి ల గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ అమ్మాయికి గంజాయి ఇచ్చి ఏడాదిగా పలుమార్లు రేప్ చేసినట్లు పోలీసు విచారణలో తేలింది.
ప్రేమ్ ,వెంకటేష్ ,నితిన్ అనే ముగ్గురు నిందితు లను గుర్తించి ఫోక్సో,NDPS యాక్టు కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు తండ్రి ఫిర్యాదు తో ఈ విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే..
తెలంగాణ రాష్ట్రంలో గంజాయి చలవిడిగా దొరుకుతున్న క్రమంలో ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టాలని మహిళా సంఘాల నేతల మండిపడుతున్నారు. అభం శుభం తెలియని అమ్మాయిలను గంజాయి మత్తు లో ఉంచి ఇలా అత్యాచార సంఘటన లు జరుగు తున్నాయని అవేదన వ్యక్తం చేస్తున్నారు.