PM Modi : సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ఈరోజు జరుగనుంది. 11 రాష్ట్రాలు, 93 సీట్లలో మొత్తం 1351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 26 స్థానాలు ఉన్న గుజరాత్ లో సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవమైంది. దీంతో గుజరాత్ లో 25 సీట్లకే పోలింగ్ నిర్వహిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గాంధీనగర్ లో పోటీ చేస్తుండగా, రాజగడ్ లో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ బరిలో ఉన్నారు. ప్రధాని మోదీ అహ్మదాబాద్ లో ఓటు వేయనున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తన తొలి ఎన్నికల్లో పోర్ బందర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లలిత్ వసోయాపై పోటీపడుతున్నారు.
కర్నాటకలో 14, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్ లో 10, మధ్యప్రదేశ్ 9, ఛత్తీస్గఢ్ 7 స్థానాలు సహా పశ్చిమ బెంగాల్, బీహార్, అసోం, గోవాలో పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.