Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీం.. అండర్ వరల్డ్ మాఫియా డాన్. యావత్ దేశాన్ని వణికించిన ఈ డాన్ 1993లో జరిగిన బొంబాయి బాంబు పేలుళ్ల ఘటనకు ప్రధాన సూత్రధారి. పేలుళ్ల ఘటన తర్వాత దావూద్ పాకిస్తాన్ కు పారిపోయాడు. అప్పటి నుంచి అక్కడే తలదాచుకుంటున్నాడు. భారత్ ఇతన్ని మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేర్చింది. భారత్ కు అప్పగించాలని పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చినా ఆ దేశం స్పందించలేదు.
తాజాగా ఇబ్రహీం ప్రాణాపాయస్థితిలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. చావుబతుకుల మధ్య ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అతడి హెల్త్ కండిషన్ దెబ్బతినడంతో కరాచీలోని ఓ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని దావూద్ అనుచరులు, పాకిస్తాన్ ప్రభుత్వం సిక్రేట్ గా ఉంచుతోంది. నిఘా వర్గాల ద్వారా ముంబై పోలీసులకు ఈ విషయం తెలిసింది.
దావూద్ ఆరోగ్యం విషమించడానికి అతడిపై విష ప్రయోగం జరగడమే కారణమని సమాచారం. ఈ విషయాన్ని పాకిస్తాన్ అధికారులు వెల్లడించకున్నా.. అతడి కుటుంబ సభ్యులు హుటాహుటీన హాస్పిటల్ కు తరలించడంపై విషప్రయోగం జరిగినట్టు తెలుస్తోంది. దావూద్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉండడంతో హాస్పిటల్ చుట్టూ పకడ్బందీ సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
దావూద్ కరాచీలోని క్లిఫ్టన్ ఏరియాలో నివసిస్తున్నాడు. పాకిస్తాన్ కు వెళ్లిన తర్వాత మరో పాకిస్తానీ పఠాన్ మహిళ మైజాబీన్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు. దావూద్ పెద్ద కుమార్తె మారుఖ్ ను పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కొడుకు జునైద్ ను పెళ్లిచేసుకున్నాడు. కాగా, 80,90 దశకాల్లో దావూద్ కనుసన్నల్లో బాలీవుడ్ ఉండేదని ఆరోపణలున్నాయి. బాలీవుడ్ హీరోయిన్లు కొందరు అతడు చెప్పినట్టు నడుచుకునేవారని చెప్పేవారు.