Dawood Ibrahim : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా అతడిపై విషప్రయోగం జరిగి కరాచీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అనే వార్తలు వచ్చాయి. అతడు చనిపోయాడు అని కూడా పుకార్లు పుట్టాయి. దావూద్ వార్తల్లో నిలువడంతో ప్రస్తుతం అతడి గురించి తెలుసుకునేందుకు నేటి జనరేషన్ సెర్చ్ చేస్తున్నారు. అతడి నేరమయ, విలాసవంత జీవితం గురించి తెలుసుకుంటున్నారు.
1993 ముంబై వరుస పేలుళ్ల దాడుల్లో దావూద్ ప్రధాన నిందితుడు. ఈ సంఘటన అప్పట్లో దేశంలో పెను సంచలనం సృష్టించింది. ముంబై పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా పాకిస్తాన్ కు పారిపోయి కరాచీలో స్థిరపడ్డాడు. అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్ ఒప్పుకోలేదు. తమ దగ్గర దావూద్ లేడనే బుకాయించేది. 2003లో ఐరాస భద్రతా మండలి దావూద్ ను మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ గా ప్రకటించింది. అతడి తలపై ఏకంగా 2.5 కోట్ల డాలర్ల రివార్డు కూడా ఉంది. దావూద్ వయస్సు ప్రస్తుతం 67 సంవత్సరాలు. డాన్ గా అందరినీ హడలెత్తించిన దావూద్ బాలీవుడ్ తారలతో ప్రేమాయణాలు కూడా నడిపాడు. అప్పట్లో అతడి వలలో పడి ఓ టాప్ హీరోయిన్ తన కెరీర్ ను పాడు చేసుకుంది. ఆమే మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్ మందాకిని.
1980,90 దశకాల్లో బాలీవుడ్ లో మందాకిని ఓ వెలుగు వెలిగింది. తన అందచందాలతో అప్పటి కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. రాజ్ కపూర్ తెరకెక్కించిన ‘రామ్ తేరీ గంగా మైలీ’తో ఆమె తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అది సూపర్ హిట్ కావడంతో మందాకిని ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. నిర్మాతలు, బడా హీరోలు ఆమెతో చేయడానికి క్యూ కట్టారు. అప్పటికే డాన్ గా ముంబైని అల్లాడిస్తున్న దావూద్ కూడా మందాకిని అందానికి ఫిదా అయ్యాడు. ఎలాగైనా ఆమెను తనదాన్ని చేసుకోవాలని భావించాడు. చివరకు ఆమెను తన ప్రేమలో పడేశాడు. ఇద్దరూ చెట్టాపట్టాలెసుకుని తిరిగారు. విలాసవంతమైన జీవితం గడిపారు. అయితే అండర్ వరల్డ్ డాన్, క్రిమినల్ అయిన మందాకిని కెరీర్ కు దెబ్బపడింది.
1994లో దుబాయ్ లోని ఓ క్రికెట్ స్టేడియంలో దావూద్, మందాకిని పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫొటో ఒక్కటి బయటకొచ్చింది. ఈ ఫొటో అప్పట్లో పెను సంచలనమైంది. ఈ ఫొటోతో మందాకిని పలు ఆరోపణలు వచ్చాయి. దావూద్ నేరకార్యకలాపాల్లో మందాకినికి చోటు ఉందని తెలిసి బాలీవుడ్ మేకర్స్ అవకాశాలు ఇవ్వడానికి భయపడ్డారు. అలాగే హీరోలు కూడా తమకెందుకీ గొడవ అని ఆమెన పక్కనపెట్టారు. దీంతో ఉన్నతశిఖరంపై ఉన్న ఆమె కెరీర్ కుప్పకూలిపోయింది. ఆమె చివరి సినిమా 1996లో వచ్చిన జోర్డా.
దావూద్ ప్రేమలో పడి జీవితాన్ని కోల్పోయిన అందాల భామ మందాకిని చివరకు ప్రముఖ డాక్టర్ కాగ్యూర్ రింపోచే ఠాకూర్ ను పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇనాయ, రబిల్ అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. వీరు దుబాయ్ లో స్థిరపడ్డారు. ఒకప్పుడు అందాల దేవతలా కొలువబడిన మందాకిని ఇప్పుడు ఒక అనామక వ్యక్తిగా అక్కడ బతుకు వెళ్లదిస్తోంది.