Payal Ghosh Sensational Comments :
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ మూవీలో తమన్నా ఫ్రెండ్ పాత్రలో నటించింది ఈ భామ. దాంతో పాటు తెలుగులో ఆమె ప్రయాణం, మిస్టర్ రాస్కెల్ లాంటి బోల్డ్ సినిమాల్లో కూడా చేసింది. అయితే మీటూ ఉద్యమ సమయంలో ఆమె బాగా వైరల్ అయింది. ఎందుకంటే అప్పట్లో ఆమె బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది.
అయితే తాజాగా మరోసారి బాలీవుడ్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో సౌత్ మీద ప్రశంసలు కురిపించింది. ఆమె మాట్లాడుతూ.. దేవుని దయ వల్ల సౌత్ ఇండస్ట్రీలో నటిగా లాంచ్ అయ్యాను. ఒకవేళ బాలీవుడ్ లో అయి ఉంటే నా బట్టలు మొత్తం విప్పేసేవారు. నా శరీరాన్ని వాడుకుని సినిమాల్లో చూపించేవారు.
వారికి హీరోయిన్ల ట్యాలెంట్ కంటే కూడా శరీరమే కావాలి. నటన వద్దు.. అవయవాలను చూపించడం మాత్రమే కావాలంటూ దారుణంగా బోల్డ్ కామెంట్లు చేసింది ఈ హాట్ భామ. వారికి ఎక్కువగా అదే కావాలి అన్నట్లు ప్రవర్తిస్తారు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన కామెంట్లు మరోసారి పెద్ద దుమారమే రేపుతున్నాయి.
ReplyForward
|