AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు వారం మాత్రమే గడువు ఉంది. ఈ సారి అసెంబ్లీతో పాటు పార్లమెంట్ కు కూడా పోలింగ్ జరగనుంది. దీంతో రాష్ట్రం ఇప్పటికే రాజకీయ నాయకుల అస్త్రాలు, శస్త్రాలతో ఆగం ఆగం అవుతోంది. ఇటు మహా కూటమి (టీడీపీ + జనసేన + బీజేపీ) అటు వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మరింత హీట్ పెంచుతున్నారు.
వీరి హీట్ కు తోడు సోషల్ మీడియా కూడా మరింత అగ్గి రాజేస్తుంది. ఒక పార్టీపై మరో పార్టీ మీమ్స్, వైరల్ వీడియోలు పోస్ట్, షేర్ చేస్తూ అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నారు. అయితే వైసీపీపై ఈ వీడియోలు ఎక్కువగా షేర్ అవుతున్నాయి. చిన్న చిన్న కొటేషన్లలో అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు నాయకులు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇవి కాస్తా జగన్ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చి పెడుతున్నాయి.
ఏపీలో ఐదేళ్ల జగన్ పాలన చూసిన ప్రజలు ఈ సారి జగన్మోహన్ రెడ్డి సీఎం కావద్దని అనుకుంటున్నారంటూ కేవలం కొటేషన్ రూపంలో ఫొటో మీమ్ వదలారు. ఎలాంటి హింట్ ఇవ్వకుండా కేలవం ‘అమ్మో వీడు మళ్లీ రాకూడదు’ అంటూ పెట్టారు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది.