31.5 C
India
Sunday, June 16, 2024
More

    YCP Govt : విద్యార్థుల తల్లులకు నోటీసులు పంపిన వైసీపీ ప్రభుత్వం

    Date:

    YCP Govt
    YCP Govt

    YCP Govt : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆపద్ధర్మ వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులకు నోటిస్ లు పంపింది. విద్యార్థుల ఫీ విషయంలో నోటీసు లు పంపి తనకేమి తెలియదన్నట్టుగా జగన్ ప్రభుత్వం ముఖం చాటేసింది. విద్యాదివేన పథకం ఏపీ లో అమలవుతోంది. విద్యార్థుల ఫీ ప్రభుత్వమే చెల్లిస్తోంది. విద్యార్థుల తల్లుల బ్యాంకు ఎకౌంట్ లో ప్రభుత్వం జమ చేస్తుంది. జమ అయిన రూపాయలను వారం రోజుల్లోగా సంబంధిత విద్యా సంస్థకు చెల్లించాలి. ఈ విదంగా బ్యాంకు లో జమ అయిన నగదును కొందరు విద్యార్థుల తల్లులు చెల్లించడంలేదు. ఈ విషయం పై స్పందిస్తూ ఫీ చెల్లించని వారికి నోటిస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాసంస్థలకు ఎవరైతే ఫీ చెల్లించలేదో, వారిని గుర్తించాలని ప్రభుత్వం గ్రామ సచివాలయం సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ సచివాలయం సిబ్బంది నోటీసులు జారీచేస్తున్నారు.

    ఆపద్ధర్మ ప్రభుత్వం కొత్త తిరకాసు పెట్టింది. మంజూరైన ఫీ చెల్లించని వారికి వచ్చే విద్యాసంవత్సరంలో మంజూరయ్యే ఫీ నేరుగా విద్యాసంస్థలకే చెల్లిస్తామని ప్రకటించింది. ప్రస్తుత ప్రభుత్వం చేసిన హెచ్చరిక రెండు విధాలుగా కనబడుతోంది. ఒకటి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని చెప్పకనే చెప్పేసింది. అంటే ప్రజలు బయపడి వెంటనే ఫీ చెల్లించాలని ఆదేశించినట్టు గా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఏర్పడకుంటే వైసీపీ నాయకుల విద్యాసంస్థలకు విద్యార్థుల తల్లుల నుంచి ముక్కుపిండి ఫీ వసూలు చేసుకోవచ్చనే ఆలోచనతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

    ముగిసిన విద్యాసంవత్సరంలో ప్రస్తుతం విద్యాసంస్థలకు సెలవులు. సెలవుల్లో కూడా విద్యార్థులు, వారి తల్లితండ్రులు సరదాగా గడపడానికి వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. అకస్మాత్తుగా వచ్చిన నోటిస్ లకు ఇళ్లలో ఉండేది తక్కువ. ఇంటిలో లేని కారణంగా నోటీసు తీసుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో నోటిస్ ఎందుకు తీసుకోలేదని కూడా ఆపద్ధర్మ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.

    విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే జూన్ మాసంలో ఫీ చెల్లించడానికి అవకాశం ఉంది. విద్యాసంస్థ నుంచి వెళ్ళిపోయేవారు సర్టిఫికెట్ కోసం వెళ్లాల్సిందే. అదేవిదంగా సంస్థలో కొనసాగే విద్యార్థులు జూన్ నెలలో వెళ్లాల్సిందే. అప్పుడు తప్పనిసరిగా ఫీ చెల్లించక తప్పదు. పట్టుమని పదిహేను రోజులకే ఆపద్ధర్మ ప్రభుత్వం నోటీసు ఇచ్చి మానసికంగా వేదించడంపై విద్యార్థులు, వారి తల్లి దండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    CM Chandrababu : నామినేటేడ్ పదవులు కష్టపడ్డ వారికే ఇస్తాం.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు

    CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు...

    West Godavari District : బ్యాటరీని మింగిన చిన్నారి.. ఎండోస్కోపీ ద్వారా తొలగించిన వైద్యులు

    West Godavari District : నెలల వయసున్న ఓ చిన్నారి బ్యాటరీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    Pawan Kalyan : మంత్రిత్వ శాఖలు నా మనసుకు దగ్గరగా ఉన్నాయి: పవన్ కళ్యాణ్

    Deputy CM Pawan Kalyan : మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు...

    Nara Lokesh : ఉండవల్లి నివాసంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించిన లోకేశ్

    Nara Lokesh : మంగళగిరి ప్రజల కోసం నారా లోకేశ్ ఉండవల్లిలోని...

    Anna Canteens : తెరుచుకోనున్న అన్న క్యాంటీన్లు.. ఈ సారి రేట్లు ఇవే..!

    Anna Canteens : ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ...