Urvashi Rautela ఐటెం సాంగ్ ల స్పెషలిస్ట్ ఊర్వశి రౌటేలా అంటే పాన్ ఇండియా వ్యాప్తంగా సుపరిచితమే.. ఈ భామ ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే మెరిసింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి వరుసగా ఐటెం సాంగ్స్ చేసుకుంటూ పోతుంది.. ముందుగా మెగాస్టార్ చిరుతో బాస్ పార్టీ సాంగ్ లో చిందేసి మెగా ఫ్యాన్స్ కు దగ్గరైంది.
ఇక ఆ తర్వాత అఖిల్ ఏజెంట్ సినిమాలో చిందేసింది.. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి తేజ్ లతో కలిసి బ్రో లో చిందేసి మరింత పాపులర్ అయ్యింది.. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వరిస్తున్నాయి.. పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ”బ్రో”..
పవన్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఈ భామ ఐటెం సాంగ్ చేసింది. అయితే ఈ భామ ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసినప్పటి నుండి పవన్ అంటే ఇష్టం, అభిమానం చూపిస్తుంది.
ఇటీవలే ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచిన ఈ భామ ఇప్పుడు మరోసారి పవన్ పై అభిమానం చాటుకుంది.. ఈమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేయగా అందులో ఒక నెటిజెన్ జగన్, పవన్ లలో ఎవరంటే ఇష్టం అని అడుగగా PSPK అంటూ సమాధానం చెప్పి పవర్ స్టార్ ఫ్యాన్స్ ను సంతోషం పరిచింది. దీంతో ఈ భామ మరోసారి వార్తల్లో నిలిచింది..